మరోసారి జంటగా సాయిపల్లవి-శర్వానంద్..?
‘పడిపడి లేచే మనసు’ సినిమాతో వెండితెరపై సందడి చేసిన జంట శర్వానంద్, సాయిపల్లవి. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలైన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్-సాయిపల్లవి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు...
హైదరాబాద్: ‘పడిపడి లేచే మనసు’ సినిమాతో వెండితెరపై సందడి చేసిన జంట శర్వానంద్, సాయిపల్లవి. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలైన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్-సాయిపల్లవి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల త్వరలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, ఆ చిత్రంలో సాయిపల్లవి-శర్వానంద్ జంటగా నటించనున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వస్తోన్నాయి. ప్రస్తుతం రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. దీనితోపాటు ఆమె రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో మెప్పించనున్నారు. ఇటీవల ‘జాను’ సినిమాతో మిశ్రమ ఫలితాలను అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె