మరోసారి ఆ కాంబినేషన్‌లో...

కథానాయకుడు బాలకృష్ణ వేగం మామూలుగా ఉండదు. ఆయన రంగంలోకి దిగారంటే చాలు... అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు

Published : 10 Mar 2020 18:35 IST

హైదరాబాద్‌: కథానాయకుడు బాలకృష్ణ వేగం మామూలుగా ఉండదు. ఆయన రంగంలోకి దిగారంటే చాలు... అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ.  ఆ తర్వాత సినిమాకి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్‌ దర్శకుడు బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి విజయవంతమైన చిత్రాలు వారి కలయికలో వచ్చాయి. వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయడం ఖాయం అయినట్టే. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న బోయపాటి   సినిమా పూర్తికాగానే, విరామం కూడా తీసుకోకుండా కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నారట బాలయ్య. మేలో చిత్రీకరణని ఆరంభిస్తారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని