నిఖిల్‌కు జోడీగా అను?

‘మజ్ను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ తర్వాత వరుస అవకాశాలు

Published : 26 Mar 2020 21:17 IST

హైదరాబాద్‌: ‘మజ్ను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నా సరైన విజయాలు ఆమె తలుపు తట్టలేదు. 2018లో ఆమె నాలుగు సినిమాల్లో నటించగా, ఏ చిత్రమూ బ్రేక్‌నివ్వలేకపోయింది. అను చివరిగా నాగచైతన్యతో కలిసి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరో తెలుగు చిత్రం చేయలేదు. త్వరలో మళ్లీ ఓ చిత్రంతో తెలుగు తెరపై మెరవబోతునట్లు సమాచారం.

యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా ‘18 పేజెస్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రతాప్‌ పల్నాటి దర్శకుడు. సుకుమార్‌ కథ, స్ర్కీన్‌ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో నాయికగా కృతిశెట్టిని ఎంపిక చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ స్థానంలో అను ఇమ్మాన్యుయేల్‌ పేరు వినిపిస్తోంది. ఈ కథ, పాత్రకు అను అయితే సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందట. ప్రస్తుతం అనుతో చర్చలు సాగుతున్నాయని సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని