‘ఎవరు’ రీమేక్‌ వార్తల్లో నిజమెంత..?

అడివి శేష్‌, రెజీనా కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ అనే స్పానిష్‌ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం అటు.......

Published : 10 Apr 2020 20:59 IST

బెంగళూరు: అడివి శేష్‌, రెజీనా కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ అనే స్పానిష్‌ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం అటు ప్రేక్షకుల నుంచి ఇటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని త్వరలో కన్నడలో రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ‘ఎవరు’ చిత్రంలో అడివి శేష్‌ పోషించిన పాత్రను కన్నడలో నటుడు దిగాంత్‌ చేయనున్నారని అంతేకాకుండా ‘ఎవరు’ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందమే ఈ రీమేక్‌ కోసం కూడా పనిచేయనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, రీమేక్‌ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని