‘పుష్ప’లో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్ని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష

Published : 18 Apr 2020 19:09 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్ని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం మిగిలిన నటీనటుల ఎంపికలో తలమునలై ఉందట. ఇందులో భాగంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి  ప్రతినాయకుడిగా నటించనున్నారట.

ఇప్పటికే ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సునీల్‌శెట్టి పేరు వినిపిస్తోంది. ‘పుష్ప’ చిత్రం కూడా ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ నటులు దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘పహిల్వాన్‌’, ‘దర్బార్‌’చిత్రాల్లో సునీల్‌ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ‘పుష్ప’లో కూడా ఆయన నటిస్తున్నారా? లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

‘పుష్ప’లో అల్లు అర్జున్‌ ఎర్రచందనం దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఫస్ట్‌లుక్‌ ఫొటో చాలా మాస్‌గా, సహజంగా ఆకట్టుకునే విధంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు అందిస్తున్నాడు. హాలీవుడ్‌కి చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రష్మిక కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని