‘మహా సముద్రం’లో మరో హీరోగా?

తొలిచిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం....

Published : 30 Apr 2020 14:50 IST

తొలిచిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం ‘మహాసముద్రం’ పేరుతో ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటించాల్సిన చిత్రమిది. యువ కథానాయకుడు శర్వానంద్‌ ఇందులో నటించేందుకు ఇదివరకే పచ్చజెండా ఊపేశారు. రెండో హీరోగా సిద్ధార్థ్‌ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. సిద్ధార్థ్‌ తెలుగులో సినిమా చేయక చాలా రోజులైంది. అజయ్‌ ఈ సినిమా గురించి చెబుతూ ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో రూపొందుతోంది. వైజాగ్‌ నేపథ్యంగా సాగుతుంది. నాకు తెలిసి ఇదే నా తొలి, చివరి మల్టీస్టారర్‌. ఎందుకంటే ఇలాంటి కథ రాయడం ఒకెత్తైతే.. దాన్ని ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించడం మరొకెత్తు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని