‘పుష్ప’కు ప్రతినాయకుడు ఎవరు?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌

Published : 11 May 2020 21:10 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. రష్మిక నాయిక. లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కీలకం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం కాబట్టి, అందుకు తగ్గట్టుగానే పలు భాషల్లో గుర్తింపు ఉన్న నటుడిని ప్రతినాయకుడిగా ఎంపిక చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

విజయ్‌ సేతుపతి, సునీల్‌ శెట్టి తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి చిత్రబృందం ఎవరిని ఎంపిక చేస్తుందనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ‘‘ప్రతినాయకుడి పాత్ర నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కించడానికి ఇంకా చాలా సమయం ఉంది. మొదట కొన్ని నెలలపాటు కథానాయకుడు, ఇతర చిత్రబృందంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. ఆలోపు ప్రతినాయకుడి పాత్ర కోసం నటుడిని ఎంపిక చేస్తాం’’ అని చిత్రవర్గాలు ‘ఈనాడు సినిమా’తో తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని