ఆ ఇద్దరిలో మంగ ఎవరు?

గోపీచంద్‌ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం

Published : 31 May 2020 15:36 IST

హైదరాబాద్‌: గోపీచంద్‌ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం తేజ ఓ విభిన్నమైన కథని సిద్ధం చేశారు. అలిమేలు మంగ పాత్ర కోసం అగ్ర కథానాయికలు పేర్లని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరు చందమామ’ కాజల్‌ కాగా, మరొకరు ‘దేవసేన’ అనుష్క. మరి ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. చిత్రీకరణలు మొదలయ్యాక ఆయా నాయికలు ఒప్పుకొన్న చిత్రాలు, వాళ్ల వెసులుబాటు మేరకే తుది ఎంపిక ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం కాజల్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ చిత్రంలోనూ కాజల్‌ నటిస్తోంది. మరోవైపు అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మాత్రమే విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ అనుష్క తన కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని