ఆ ఇద్దరిలో మంగ ఎవరు?
గోపీచంద్ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం
హైదరాబాద్: గోపీచంద్ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం తేజ ఓ విభిన్నమైన కథని సిద్ధం చేశారు. అలిమేలు మంగ పాత్ర కోసం అగ్ర కథానాయికలు పేర్లని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరు చందమామ’ కాజల్ కాగా, మరొకరు ‘దేవసేన’ అనుష్క. మరి ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. చిత్రీకరణలు మొదలయ్యాక ఆయా నాయికలు ఒప్పుకొన్న చిత్రాలు, వాళ్ల వెసులుబాటు మేరకే తుది ఎంపిక ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం కాజల్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్ చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. మరోవైపు అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మాత్రమే విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ అనుష్క తన కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..