మరోసారి జోడీగా చై-సమంత?

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని

Updated : 03 Jul 2020 23:05 IST

హైదరాబాద్‌: నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన ఆయన అర్థాంగి సమంత నటించే అవకాశాలున్నట్టు సమాచారం.

పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘మనం’ తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని