Nagarjuna: తండ్రీ తనయులు కలిసి?

అక్కినేని కుటుంబం నుంచి మరో క్రేజీ మల్టీస్టారర్‌ రానుందా? అందులో నాగార్జున.. ఆయన తనయుడు అఖిల్‌ కలిసి నటించనున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ప్రస్తుతం నాగ్‌ ‘ది ఘోస్ట్‌’తో.. అఖిల్‌ ‘ఏజెంట్‌’తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇవి పూర్తయిన

Published : 08 Aug 2022 17:14 IST

అక్కినేని కుటుంబం నుంచి మరో క్రేజీ మల్టీస్టారర్‌ రానుందా? అందులో నాగార్జున.. ఆయన తనయుడు అఖిల్‌ కలిసి నటించనున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ప్రస్తుతం నాగ్‌ ‘ది ఘోస్ట్‌’తో.. అఖిల్‌ ‘ఏజెంట్‌’తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇవి పూర్తయిన వెంటనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కనుంది. దీనికి మోహన్‌ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రం రూపొందనుందని, ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో నాగార్జున ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలోనే నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున - అఖిల్‌ గతంలో ‘సిసింద్రీ’, ‘మనం’, ‘అఖిల్‌’ చిత్రాల్లో తెర పంచుకున్నారు.


పూరి.. ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌

వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘లైగర్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘జనగణమన’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు పాన్‌ ఇండియా చిత్రాల్లోనూ విజయ్‌ దేవరకొండే కథానాయకుడు. వీటి తర్వాత పూరి ఓ భారీ సినిమా  చేయనున్నారు. అదొక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా రూపొందనుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ బాలీవుడ్‌ హీరోని రంగంలోకి  దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్ధమైందని, సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలిసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని