‘దొరసాని’ రెండో సినిమా ఖరారు

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 19 Jan 2020 22:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో అరుణ్‌ అదిత్‌ ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. శివాత్మిక ‘దొరసాని’లో పూర్వకాలంలో ఉన్నతవర్గం యువతిగా కనిపించగా.. ఈ సినిమాలో ఆధునికయువతిగా కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు 24 కిస్సెస్‌ హీరో అరుణ్‌.. యాంగ్రీ హీరో రాజేశేఖర్‌ నటించిన గరుడవేగ సినిమాలోనూ హ్యాకర్‌ పాత్రలో కనిపించాడు. నూతన దర్శకుడు దుర్గానరేశ్‌ గుట్ట దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను శివదినేశ్‌ రాహుల్‌, అయ్యర్‌ నకరకంటితో పాటు ఎస్‌కేఎస్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఈ సినిమాకు సంబంధించిన తొలిపూజ చేయనున్నారు. కోట శ్రీనివాస్‌రావు, పోసాని కృష్ణమురళి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ చాలాకాలం తర్వాత తీస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలోనూ ఓ పాత్రలో శివాత్మిక కనిపించనుంది. మరి ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు ముందుగా వస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని