‘బేబమ్మా’ అంటున్న వైష్ణవ్‌ తేజ్‌

టాలీవుడ్‌ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌కు జంటగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు...

Published : 05 Feb 2020 11:28 IST

ఆకట్టుకుంటున్న ‘ఉప్పెన’ ఫస్ట్‌ వేవ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌కు జంటగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీలుక్‌, ఫస్ట్‌లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న చిత్రబృందం తాజాగా ‘ఉప్పెన’ ఫస్ట్‌ వేవ్‌ను అభిమానులతో పంచుకుంది. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌.. కృతిశెట్టిని ఉద్దేశిస్తూ.. ‘బేబమ్మా’ అని పిలుస్తూ కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్‌వేవ్‌ను షేర్‌ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌.. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని