వెంకటలక్ష్మి ఎలా మిస్సయిపోయింది?

విశ్వంత్‌, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు.....

Published : 07 Feb 2020 17:40 IST

ఆసక్తికరంగా ‘ఓ పిట్ట కథ’ టీజర్‌

హైదరాబాద్‌: విశ్వంత్‌, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘అనగనగా ఒక ఊళ్లో వెంకటలక్ష్మి అనే అందమైన అమ్మాయి ఉండేదట. అదే ఊళ్లో ఉంటున్న ప్రభుకి వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టమట. అప్పుడు వెంకటలక్ష్మి ఇంటికి క్రిష్‌ వచ్చాడట’ అంటూ ఓ చిన్నారి కథ చెబుతుండగా.. మధ్యలో వాళ్ల నాన్న ‘మరి వీరిద్దరిలో వెంకటలక్ష్మి ఎవరిని ఇష్టపడుతోంది’ అని అడగ్గా, ‘ఇంతలోనే ఆమె మిస్సయిపోయింది.. ఎలా కనిపించకుండా పోయిందో తెలియాలంటే ఓ పిట్ట కథ చూడాల్సిందే’ అంటూ ఓ చిన్నారి చిత్ర కథ టీజర్‌లో వివరించడం ఆసక్తికరంగా ఉంది.

గ్రామీణ వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమ కథకు, సస్పెన్స్‌ జోడించి సినిమాను తెరకెక్కించినట్లు టీజర్‌ బట్టి అర్థమవుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఓ పిట్ట కథ’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కిరాజు స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని