‘కేజీఎఫ్‌2’ కీలకపాత్రధారి వచ్చేసింది

‘కేజీఎఫ్‌ 2’ సినిమాలోని కీలక పాత్రధారి తాజాగా ఆ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. కన్నడ చిత్రంగా తెరకెక్కి భారతీయ చలనచిత్ర ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ నటుడు యశ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు...

Published : 09 Feb 2020 14:35 IST

సెట్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ నటి

బెంగళూరు: ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలోని కీలక పాత్రధారి తాజాగా ఆ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. భారతీయ చలనచిత్ర ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ నటుడు యశ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎంతో కీలకమైన ‘అధీర’ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కనిపించనున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోనే ‘కేజీఎఫ్‌2’ కూడా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇప్పుడు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కీలక పాత్రను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ‘కేజీఎఫ్‌2’ సెట్‌లో అడుగుపెట్టారు. షూటింగ్‌ ఆరంభానికి ముందు దర్శకుడితో కలిసి ఆమె ఫొటోలకు ఫొజులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘డెత్‌ వారెంట్‌ను జారీ చేసిన లేడీ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఎంతో సరదాగా ఉండే రవీనా టాండన్‌కు ‘కేజీఎఫ్‌2’ టీంలోకి సుస్వాగతం’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని