పోకిరీ కుర్రాళ్లను కొట్టిన నాగశౌర్య

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాగశౌర్య కొందరు పోకిరీ కుర్రాళ్లను కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను...

Published : 09 Feb 2020 17:25 IST

ఆవేశంలో ఉన్న నటుడు.. ఆన్‌లైన్‌లో వీడియో

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాగశౌర్య కొందరు పోకిరీలను కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి నాగశౌర్యనే కథ అందించారు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సన్పెన్స్‌ థ్రిల్లర్‌లో నాగశౌర్యకు జంటగా మెహరీన్‌ నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 

‘అశ్వథ్థామ’ చిత్రానికి విశేషమైన ప్రేక్షకాధరణ లభించిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫైట్‌ సీన్‌ను సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో నాగశౌర్య.. తన చెల్లిని ఏడిపించిన ఒక కుర్రాడిని అతని స్నేహితులను కొడుతూ కనిపించారు. దాదాపు మూడున్నర నిమిషాలున్న ఈ సీన్‌ను సింగిల్‌ షాట్‌లో చిత్రీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని