అభిమానులకు తేజ డబుల్‌ ధమాకా..!

ప్రముఖ దర్శకుడు తేజ సినీ ప్రియులకు డబుల్‌ ధమాకా ఇచ్చారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. ‘అలిమేలు మంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిళ్లతో వీటిని తెరకెక్కిస్తున్నట్లు...

Updated : 23 Feb 2020 09:26 IST

ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించిన దర్శకుడు

హైదరాబాద్‌‌: ప్రముఖ దర్శకుడు తేజ సినీ ప్రియులకు డబుల్‌ ధమాకా ఇచ్చారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. ‘అలిమేలు మంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిళ్లతో వీటిని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాల్లోని ఒకదానిలో గోపీచంద్‌ హీరోగా నటించనుండగా మరొక దానిలో రానా కథానాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రానా-తేజ కాంబినేషన్‌లో విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ‘జయం’, ‘నిజం’ సినిమాలతో గోపీచంద్‌లోని విలన్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా తేజానే. 

విభిన్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు తేజ. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’, ‘జై’,  వంటి చిత్రాలతో విజయాల తర్వాత వరుస పరాజయాలను చవిచూసిన ఆయన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ‘సీత’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని