‘మైండ్‌బ్లాక్’ వచ్చేసింది..!

సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి.. ‘బాక్సాఫీస్‌కా బాప్‌’ అని అభిమానులతో పిలిపించుకున్న మహేశ్‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో మహాశ్‌ నటనను చూసిన సినీ ప్రియులు, సూపర్‌స్టార్‌ అభిమానులు...

Published : 29 Feb 2020 13:59 IST

ఫుల్‌ వీడియో విడుదల చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన మహేశ్‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహాశ్‌ నటనను చూసిన సినీ ప్రియులు, సూపర్‌స్టార్‌ అభిమానులు ‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్’ అని కితాబిచ్చారు. ఈ సినిమా విడుదలై నేటితో 50 రోజులు పూర్తయిన సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘మైండ్‌బ్లాక్‌’ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పాటలో మహేశ్‌, రష్మిక మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో కనిపించారు. ఇందులో ఆయనకు జంటగా రష్మిక నటించారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రం విడుదలై 50 రోజులైన సందర్భంగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పలు హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.

ఇదీ చదవండి

‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్‌ ప్రోమో చూశారా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని