‘సూర్యుడివో.. చంద్రుడివో..’ పూర్తి పాట చూశారా

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మరోపాట వీడియో విడుదలైంది. ఇందులోని ‘సూర్యుడివో చంద్రుడివో..’ అనే పూర్తి పాట యూట్యూబ్‌లో వచ్చేసింది. పల్లెటూరి అందాలతో పాట విజువల్స్‌ చక్కగా ఉన్నాయి. ఈ గీతాన్ని బి. ప్రాక్‌ ఆలపించారు.....

Published : 03 Mar 2020 18:37 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మరోపాట వీడియో విడుదలైంది. ఇందులోని ‘సూర్యుడివో చంద్రుడివో..’ అనే పూర్తి పాట యూట్యూబ్‌లో వచ్చేసింది. పల్లెటూరి అందాలతో పాట విజువల్స్‌ చక్కగా ఉన్నాయి. ఈ గీతాన్ని బి. ప్రాక్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ అందుకుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించారు. 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని