‘మోసగాళ్లు’ వచ్చేది అప్పుడే!

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఆంగ్ల చిత్రాన్ని జులైలో, తెలుగు చిత్రాన్ని...

Updated : 05 Apr 2020 11:09 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. తెలుగు చిత్రాన్ని జూన్‌ 5న, ఆంగ్ల చిత్రాన్ని జులైలోనూ విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ వ్యయంతో హైదరాబాద్‌లో ఓ ఐటీ ఆఫీస్‌ సెట్‌ని నిర్మించారు. అందులో చిత్రీకరణ జరుగుతుండగా, కరోనా ప్రభావంతో ఆపేశారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిందని అందుకే విడుదల తేదీని ఖరారు చేశామని మంచు విష్ణు తెలిపారు. ఇందులో అర్జున్‌గా మంచు విష్ణు.. అను పాత్రలో కాజల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ పాత్రలకు సంబంధించి ఇటీవల విడుదల చసిన లుక్స్‌ ఆకట్టుకున్నాయి. ఇందులో నవదీప్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని