విజయశాంతిని ఒప్పించడం చాలా కష్టమైంది
టాలీవుడ్లో మా సినిమాల్ని చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మరి బాలీవుడ్, హాలీవుడ్కు వెళ్లడం ఎందుకు? అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి హిట్లతో జోరుమీదున్న ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.......
చిరంజీవి ‘ఊ..’ అనాలేకానీ ఎంతసేపు..!
కల్యాణ్రామ్ లేకపోతే నేను లేను: అనిల్ రావిపూడి
హైదరాబాద్: టాలీవుడ్లో మా సినిమాల్ని చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మరి బాలీవుడ్, హాలీవుడ్కు వెళ్లడం ఎందుకు? అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి హిట్లతో జోరుమీదున్న ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అగ్ర కథానాయకుడు మహేశ్బాబు నటించారు. రష్మిక కథానాయిక. విజయశాంతి, ప్రకాశ్రాజ్, సంగీత, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అనిల్ మీడియాతో ముచ్చటించారు. తన సినీ కెరీర్ను గుర్తు చేసుకున్నారు.
ఇంకా నవ్వుకుంటారు
‘‘ఎఫ్ 2’తో ఎంత నవ్వుకున్నారో.. ‘సరిలేరు నీకెవ్వరు’తో అంతకంటే ఎక్కువ నవ్వుకుంటారు. సంక్రాంతి భోజనం ఎంత రుచిగా ఉంటుందో ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. నేను ప్రతి సినిమాకు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. మహేశ్బాబు నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించారు. ‘ఎఫ్ 2’ చేస్తున్నప్పుడే ఆయనకు స్క్రిప్టు చెప్పాను. ఆయన నన్ను ఎంతగానో నమ్మారు కాబట్టి.. ఎంత కసితో, ఏకాగ్రతగా తీయాలో అలానే తీశా. కచ్చితంగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’.
25 నిమిషాలు కీలకం
‘ఈ సినిమా షూటింగ్ కేవలం ఐదు నెలల్లో పూర్తయింది. తొలుత వచ్చే 25 నిమిషాలు చాలా కీలకం. మహేశ్ సర్ తొలుత 40 నిమిషాలు స్క్రిప్టు విన్న తర్వాత నమ్మారు. కథలో మ్యాజిక్ ఉందని ఫీల్ అయ్యారు. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడు పూర్తి స్క్రిప్టు చెప్పా. తొలి నరేషన్కే ఆయనకు సినిమా డైలాగ్స్తో సహా మొత్తం గుర్తుండిపోయింది. ఇందులో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ ఆర్మీ సైనికుడు సాధారణ సమాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలు అతడికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ‘బాధ్యత ఉండాలి కదా’ అని ఫీల్ అయ్యే పాత్ర. ఇది మహేశ్ సర్కు కూడా చాలా నచ్చింది. నేను కూడా ఆయన్ను తప్పా మరొకరిని ఊహించుకోలేకపోయా’.
కథ అలా పుట్టింది
‘‘సుప్రీం’ సినిమా కోసం జోధ్పూర్ వెళ్లి తిరిగి రైలులో హైదరాబాద్ వస్తుండగా ఓ సైనికుడ్ని కలిశాను. ఆయనతో ఓ రోజు గడిపా. ఓ సైనికుడిలా కాకుండా ఎంతో సరదాగా జోక్లు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నాకు ‘సరిలేరు నీకెవ్వరు’ కథ తట్టింది. వాళ్లూ మనలాంటి మనుషులే.. ఎప్పుడు ఎలా ఉండో వారికి తెలుసు. అక్కడి నుంచి నాకు ఈ సినిమా కథ వచ్చింది. ప్రకాశ్రాజ్, విజయశాంతి, మహేశ్బాబు.. మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. ముందుగా ఈ సినిమా కోసం జగపతిబాబును తీసుకున్నాం. కానీ ఓ టెక్నికల్ సమస్య వల్ల ఆ స్థానంలో ప్రకాశ్రాజ్ను తీసుకున్నాం. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఇతర కారణాల వల్ల జగపతిబాబు సర్ తప్పుకున్నారు’.
అనవసరంగా కమిట్ అయ్యారు
‘ప్రీ రిలీజ్ వేడుకగా కొరటాల శివ నన్ను మెచ్చుకున్నారు. అందరూ అనిల్లా పనిచేస్తే బాగుంటుంది అన్నారు. చిరు సినిమా షూటింగ్ 90 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఆ రోజు కొరటాల శివ సర్ అనవసరంగా బుక్ అయ్యారు (నవ్వుతూ). ఐదు నెలల్లో సినిమా పూర్తి చేయడం అనేది సులభమైన పనికాదు. అన్నీ కలిసి రావాలి. నటీనటుల డేట్స్ కుదరాలి. వర్షాలు పడకుండా వాతావరణం అనుకూలించాలి. ఇలా ఎన్నో ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సినిమాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు’.
విలన్లు కూడా ఫన్గానే..
‘మహేశ్ వల్ల ఈ సినిమాలో కామెడీ పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఫన్, ఎమోషన్ను రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. నేను ఓ సీరియస్ సీన్ తీసినా.. మళ్లీ యూటర్న్ తీసుకుని కామెడీ చేసేస్తా. నా సినిమాలో విలన్లు కూడా సరదాగానే ఉంటారు (నవ్వుతూ). ‘పటాస్’, ‘సుప్రీమ్’.. ఇలా అన్నింటిలోనూ అలానే ఉంటుంది. ‘ఎఫ్ 2’ నా కెరీర్కు గేమ్ ఛేంజర్గా మారింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైంది. ‘సరిలేరు నీకెవ్వరు’లో రైలు సీన్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్కు వెళ్లడానికి సిద్ధమౌతున్నారు’.
మహేశ్ స్వేచ్ఛ ఇస్తారు
‘మహేశ్ సర్లోని గొప్ప లక్షణం.. స్వేచ్ఛ ఇవ్వడం. ఆయన అది ఇవ్వకపోతే మనం అంత పెద్ద స్టార్తో కలిసి పనిచేడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఆయన షూటింగ్కు వచ్చిన రోజు నుంచీ ఓ సూపర్స్టార్తో కలిసి పనిచేసిన భావన నాకు ఎప్పుడూ కలగలేదు. మహేశ్ జోక్లు వేస్తుంటారు, స్నేహంగా ఉంటారు. అసలు సమయం తెలియదు. మనకు సీన్ ఎలా కావాలో అలా వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటారు. ఈ సినిమా వల్ల మహేశ్కు నేను ప్లస్ అవడం కాదు. నా కెరీర్కు ఆయన ప్లస్ అవుతారు. ఆయన చేయని పాత్రలు లేవు, చూడని బ్లాక్బస్టర్లు లేవు. కాబట్టి ఇది నాకే ప్లస్ అవుతుంది’.
కథ గెలిచింది
‘సినిమాలో విజయశాంతిని చూసిన ప్రతి ఒక్కరు.. ఆమె 13 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ పాత్రలో నటించారో అర్థం చేసుకుంటారు. ఎలాగైతేనే.. సరైన పాత్ర ఎంచుకున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ‘రాజా దిగ్రేట్’ సమయంలో ఆమెను కలిశా. ఓ మంచి పాత్రతో వెళ్తే ఆమె నటిస్తారనే నమ్మకం నాకు వచ్చింది. దీంతో ఆమె కోసం ఈ పాత్ర రాశా. విజయశాంతి గారిని ఒప్పించడం చాలా కష్టమైంది. నేను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆమెకు సినిమా చేయాలనే ఆసక్తే లేదు. రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ కథే గెలిచింది. ‘మేడం కథ వినండి, మీకు నచ్చకపోతే వెళ్లిపోతా’ అన్నాను. స్క్రిప్టు విన్న తర్వాత ఆమెకు పాత్ర నచ్చింది. మిగిలిన కథ కూడా నచ్చింది. అందుకే ఒప్పుకున్నారు. ఈ సినిమా చివరి 15 నిమిషాలకి అందరూ కనెక్ట్ అవుతారు. చాలా బాగుంటుంది’.
దేవిశ్రీకి హ్యాట్సాఫ్
‘నేను కలిసిన మనుషుల్లో దేవిశ్రీ ఓ పాజిటివ్ వ్యక్తి. ఆయన ఇచ్చిన అన్నీ ట్యూన్స్ అద్భుతంగా ఉండటం అంటే కష్టం. దర్శకుడు చెప్పిన లైన్స్ను బట్టి ఆయన సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. తప్పు జరిగితే అది ఆయన బాధ్యత కాదు. గతం పక్కనపెడితే.. ఈ సినిమా కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. సైనికుల గురించి గొప్పగా పాట రాశారు. దానికి ఆయన హ్యాట్సాఫ్ చెప్పాలి’.
కల్యాణ్ రామ్ ఉన్న స్థితిలో..
‘ఎన్నో సమస్యలు ఎదుర్కొని ‘పటాస్’ తీశా. ఇవాళ సూపర్స్టార్తో పనిచేసే దాకా ప్రయాణించా. నన్ను నమ్మి ఏ హీరో వచ్చినా.. వారి కోసం శ్రమించా. నన్ను మోసిన ప్రతి మెట్టు నాకు ముఖ్యమే. నందమూరి కల్యాణ్రామ్ నన్ను నమ్మి ‘పటాస్’లో నటించారు. అప్పట్లో ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆ సినిమా చేయడం గొప్ప. ‘ఓం’ విడుదలై, ఆయన చాలా సమస్యల్లో ఉన్నారు. ఆయన లేకపోతే నేను లేను. కల్యాణ్రామ్, సాయిధరమ్, రవితేజ, వరుణ్తేజ్, వెంకటేష్.. ఇలా అందరూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు’.
ఇది పోటీ కాదు
‘‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్ని ఒకే రోజు విడుదల చేయాలనే టాపిక్ వచ్చినప్పుడు ఒత్తిడిగా ఫీల్ అయ్యా. కానీ అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించారు. దీన్ని నేను పోటీగా భావించడం లేదు. త్రివిక్రమ్ గారి స్టైల్ వేరు. నాది వేరు. ఆయన క్లాస్గా తీస్తారు, నేను మాస్గా తీస్తాను. కాబట్టి ఎవరికి ఉండాల్సిన మార్కెట్ వారికి ఉంటుంది. సమస్య ఏమీ ఉండదు. ఇప్పటికే పలుమార్లు సంక్రాంతికి చాలా సినిమాలు ఒకేసారి వచ్చి హిట్ అయ్యాయి’.
* ‘మీ సినిమాల్లో కథ ఉండదని విమర్శలు ఉన్నాయి?, కొన్ని సీన్లు జబర్దస్త్ కామెడీ ట్రాక్లలా ఉన్నాయని కామెంట్లు కూడా చేశారు?’ అని ప్రశ్నించగా అనిల్ సమాధానం ఇచ్చారు. ‘కథ లేకపోతే ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు. నా ప్రతి సినిమాలో కథ ఉంది. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరో కెరీర్కు హిట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో భార్యాభర్తల సమస్యల్ని చూపించాం. అందరూ కనెక్ట్ అయ్యారు. ఇవి జబర్దస్త్లా ఉంటే థియేటర్లకు వచ్చి ఎందుకు సినిమా చూస్తారు. ఇంట్లో కూర్చొని జబర్దస్త్ చూస్తారుగా.. మనం చేసే పని 100 మందికి నచ్చదు. 70 మంది మెచ్చుకుంటే, 30 మంది ఏం తీసినా తిడతారు.. ఆ 70 మంది కోసం సినిమా తీస్తాం. మీరు అన్నారని నేను వేరే సినిమా తీసుకొస్తే.. మళ్లీ మీరే నన్ను అంటారు. నా బలం వదిలేసి.. పక్కకు వచ్చానని రాస్తారు’.
* ‘మీరు, చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు. మీ స్టిల్స్ చూసి అలా ఫీల్ అవుతున్నారు. ఆయన కూడా మీపై ఆసక్తి చూపుతున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘మీరే మాతో సినిమా చేయించేలా ఉన్నారు (నవ్వుతూ). నాకు ఆయనతో పనిచేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. ఆయన ‘ఊ..’ అనాలే కానీ కథ రాయడం ఎంతసేపు. మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తా. గతంలో బాలకృష్ణ సర్తో ఓ సినిమా అనుకున్నాం. ఆయన బిజీగా ఉన్నారు, చూడాలి’ అని అనిల్ జవాబిచ్చారు.
* ఈ సినిమాలో కృష్ణ గారు ఉన్నారా? అని ప్రశ్నించగా.. ‘సినిమాలో కృష్ణ సర్ ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి భయ్యా.. మీ ఒళ్లుగగుర్పొడుస్తుంది. థియేటర్లో ఆ సీన్ వచ్చినప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. కమర్షియల్ సినిమాలో ఇలా ఇద్దరు స్టార్స్ ఉండటం అరుదు. మీరంతా కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!