చెప్పాను కదా! థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!
సరిలేరు నీకెవ్వరు’ విజయంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న...
అందుకే అడ్వాన్స్ కూడా తీసుకోలేదు!
‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సూపర్స్టార్ విలేకరులతో మాట్లాడారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విశేషాలతో పాటు, విజయశాంతితో కలిసి పనిచేయడం, తన కొత్త సినిమా విశేషాలను ఎన్నో పంచుకున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ ఎలా ప్రారంభమైంది?
మహేశ్బాబు: ‘ఎఫ్ 2’ జరుగుతున్నప్పుడే అనిల్ రావిపూడి నాకు ఈ కథ చెప్పారు. వినగానే నచ్చేసింది. కానీ ‘నాకు మధ్యలో మరో సినిమా ఉంది. అది అయ్యాక చేద్దాం’ అన్నాను. ‘ఎఫ్ 2’ ఎప్పుడైతే చూశానో, అర్జెంటుగా అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించేయాలి అనిపించింది. ‘త్వరగా పూర్తి చేయగలరా’ అని అడిగాను. ‘చేసేద్దాం’ అన్నారు. అలా కేవలం అయిదు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ఎలా పూర్తి చేశాడా? అని తలచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడిదే.
భవిష్యత్తులో రాబోయే చిత్రాలను ఇంతే వేగం చూపిస్తారా?
మహేశ్బాబు: అది కథల్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అందుకే త్వరత్వరగా నిర్ణాయాలు తీసుకున్నాం. ఈ కథ ఒప్పుకోవడం, ఇంత త్వరగా పూర్తి చేయాలనుకోవడం నా కెరీర్లో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలు. నేనైనా మధ్యలో ఐదారు రోజులు రిలాక్స్ అయ్యాను. కానీ, చిత్రబృందం అంతా ఈ అయిదు నెలలూ పగలూ రాత్రీ కష్టపడుతూనే ఉంది.
ఆర్మీ ఆఫీసర్గా కనిపించడానికి ప్రత్యేకమైన కసరత్తులేమైనా చేశారా?
మహేశ్బాబు: ఆర్మీ ఆఫీసర్ అంటే ఫిట్గా కనిపించాలి. అందుకోసం ఆరు కిలోలు తగ్గాను. పాత్ర కోసం ఏం హౌంవర్క్ చేయాలో అంతా చేశాను. అందుకోసమే ఓ నెల ఆలస్యంగా ఈ సినిమా పట్టాలెక్కింది.
ఈ సినిమాతో మాస్ సినిమా చేయాలన్న అభిమానుల కోరిక తీరినట్టేనా?
మహేశ్బాబు: ‘దూకుడు’ తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ఈ మధ్య చేయలేదు. మరీ సీరియస్ ఎమోషన్స్ ఉన్న కథల్ని ఎంచుకుంటున్నానేమో అనిపించింది. ఆ సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ కథ వచ్చింది. అనిల్ రావిపూడి సినిమాల్లో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది ఆర్మీ ఆఫీసర్ పాత్ర. కొన్ని హద్దులు ఉంటాయి. ఏది పడితే అది చేయలేం. అవన్నీ దృష్టిలో ఉంచుకుని, ఈ పాత్రద్వారా ఎంత వినోదం పంచగలమో, అంతా అందించాం.
ఒక సినిమా కోసం ఎలా సిద్ధమవుతారు?
మహేశ్బాబు: కథ నచ్చాక, స్క్రిప్టు ‘ఓకే’ అయ్యాక నేను పూర్తిగా దర్శకుడికి లొంగిపోతాను. తను చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతాను. నేర్చుకున్నదంతా పక్కన పెట్టి, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను పనిచేసే పద్ధతి కూడా అలానే ఉంటుంది. ఉన్నదాంట్లోనే కొత్తగా ఏం చేయగలం? అనేది ఆలోచిస్తుంటాను.
ఈ సినిమాపై మీ అంచనాలు ఏమేరకు ఉన్నాయి?
మహేశ్బాబు: చెప్పాను కదా.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే (నవ్వుతూ)
చాలా ఏళ్ల తరవాత విజయశాంతితో కలసి నటించారు. ఆ అనుభవాలెలా ఉన్నాయి?
మహేశ్బాబు: తొలి రోజు సెట్లో కొంచెం కంగారుగా అనిపించింది. అయితే మా ఇద్దరిపై సన్నివేశాన్ని పూర్తి చేయగానే, ‘కొడుకు దిద్దిన కాపురం’ నిన్నో మొన్నో షూటింగ్ చేసిన ఫీలింగ్ వచ్చేసింది. ఆమెను తప్ప ఈ పాత్రలో ఎవరినీ ఊహించలేకపోయాను.
ఇప్పుడు హీరోలందరూ ప్రయోగాలు చేస్తున్నారు. మీరూ చేస్తారా?
మహేశ్బాబు: ప్రయోగాలు చేద్దామని అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. పెద్ద హీరోలంతా విచిత్రమైన జోన్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే ప్రయోగాలు చేసేయకూడదు. వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయో, లేదో చూసుకోవాలి. అదే సమయంలో కథలో కొత్తదనం కూడా ఉండాలి. ఇవన్నీ కుదిరితే ఓకే. లేదంటే బయ్యర్లు నష్టపోతారు.
మీ నాన్నగారు ఈ సినిమాలో కనిపిస్తారని చెప్పారు. ఏ సందర్భంలో ఆ పాత్ర వస్తుంది?
మహేశ్బాబు: టికెట్టు కొని సినిమా చూడండి. తెరపై చూస్తే కచ్చితంగా థ్రిల్కి గురవుతారు. అప్పటి వరకూ ఆగండి.
మీనాన్నగారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలని చిరంజీవి డిమాండ్ చేశారు కదా. ఆ కామెంట్లపై మీ స్పందన ఏమిటి?
మహేశ్బాబు: చాలా సంతోషం వేసింది. ఇంటికి వెళ్లగానే నాన్నగారికి ఈ విషయం చెప్పాను. ‘చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. ఆయనకు థ్యాంక్స్ చెప్పు’ అన్నారు. ముందు నుంచీ ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా సినిమా హిట్టయితే తొలి ఫోన్ కాల్ ఆయన దగ్గరి నుంచే వస్తుంది. జనవరి 12న నుంచి కూడా ఆయన నుంచి ఫోన్ వస్తుందని ఆశిస్తున్నాను.
‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ రెండూ ఒకేరోజు విడుదల అవుతాయేమో అనుకున్నారు. ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది?
మహేశ్బాబు: పెద్ద సినిమాలకు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం సరైంది కాదు. దాని వల్ల వసూళ్లని పంచుకోవాల్సివస్తుంది. భారీ బడ్జెట్తో తీసిన సినిమాలివి. బయ్యర్లు నష్టపోతారు. గిల్డ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించారు. వాళ్లకి నా కృతజ్ఞతలు.
అడ్వాన్సు కూడా తీసుకోకుండా ఈ సినిమా చేశారు కదా. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చింది?
మహేశ్బాబు: చాలా త్వరగా ఈ సినిమాని పూర్తి చేద్దాం అనుకున్నాం. అనుకున్న సమయానికి విడుదల అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఆ వెసులుబాటు నిర్మాతలకు కల్పించాలి.
భవిష్యత్తులోనూ నిర్మాణాన్ని కొనసాగిస్తారా?
మహేశ్బాబు: తప్పకుండా. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాణ విషయాల్లో నేనేం జోక్యం చేసుకోలేదు.
పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. మీరూ అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
మహేశ్బాబు: దక్షిణాది చిత్రాలు బాగా ఆడుతున్నాయి. సరిహద్దుల్ని చెరిపేస్తూ మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. ‘కేజీఎఫ్’లాంటి చిత్రాలు బాలీవుడ్కీ వెళ్లి నిరూపించుకున్నాయి. మంచి కథ వస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయి సినిమా తీయొచ్చు.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా ఉందా?
మహేశ్బాబు: ఆ మధ్య మేం కలుసుకున్న మాట వాస్తవమే. కొన్ని కథలు కూడా అనుకున్నాం. ఎప్పుడు చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేను.
తదుపరి సినిమా ఎప్పుడు?
మహేశ్బాబు: ‘సరిలేరు...’ తరవాత రెండు నెలలు గ్యాప్ తీసుకుంటా. ఆ తరవాత వంశీ పైడిపల్లి సినిమా ఉంటుంది. ఈసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయబోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్తేజ్తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!