అందుకే ‘అల.. వైకుంఠపురములో’ అని పెట్టాం!
‘‘సినిమాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనెప్పుడూ చదవను. ముందు చదవడాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. అయితే మనం చదివింది, విన్నది, మాట్లాడింది ఎక్కడో ఒక చోట ఉపయోగ పడుతుంది’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. రచయితగా ప్రయాణం ప్రారంభించిన...
‘‘సినిమాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనెప్పుడూ చదవను. ముందు చదవడాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. అయితే మనం చదివింది, విన్నది, మాట్లాడింది ఎక్కడో ఒక చోట ఉపయోగ పడుతుంది’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. రచయితగా ప్రయాణం ప్రారంభించిన ఆయన తెలుగు సినిమా మాటల్ని కొత్త పుంతలు తొక్కించారు. మాటకి ఇంత శక్తి ఉందని మరోమారు మాట్లాడుకునేలా చేశారు. దర్శకుడిగా మారాక మాటలతోనే కాకుండా, కథలతోనూ ఆయన కలం మెరుపులు మెరిపిస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం ఈ నెల 12న వస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్రివిక్రమ్ శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ.
ఈమధ్య మీ సినిమాల పేర్లన్నీ ‘అ’ అక్షరంతోనే మొదలవుతున్నాయి...
నాకూ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ ఈ సెంటిమెంట్ అయితే లేదు. ఇదివరకు వేరే అక్షరాలతో మొదలైన సినిమాలూ తీశాను కదా. ఈమధ్య ‘అ’ అక్షరంతో కుదురుతున్నాయంతే. పోతన రాసిన పద్యం స్ఫూర్తితో ‘అల.. వైకుంఠపురములో’ అని ఈ సినిమాకు పేరు పెట్టాం.
‘అత్తారింటికి దారేది’ నుంచి మీ సినిమా కథలు ఎక్కువగా ఇంటిచుట్టూ, కుటుంబం చుట్టూనే నడుస్తున్నాయి. కారణమేంటి?
మనం ప్రపంచమంతా తిరగొచ్చు కానీ, ఇంటికి వచ్చేసరికి సుఖంగా ఉంటుంది. అది రెండు గదుల ఇల్లే కావొచ్చు. కానీ దాంట్లో ఉండే ఆనందం వేరు. ఒక కథకుడిగా ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నానేమో. ఈ సినిమా చూశాక ఆ ఇంటికి, ఆ స్థానానికి ఉన్న విలువ తెలుస్తుంది. ఇందులో కథానాయకుడు డ్రామా కోసం ఇంటికి వెళ్లడు. అసలు అది తనకెందుకు ముఖ్యమైందనేది సినిమా చూశాకే తెలుస్తుంది. అందుకే ఆ ఇంటికి వైకుంఠపురం అని పేరు పెట్టి, ఆ పేరే సినిమాకి పెట్టాం.
ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిస్తుంది. దర్శకుడిగా మీరెలాంటి అనుభూతికి గురయ్యారు?
పరిపూర్ణమైన అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. ఇక నా అనుభూతి అంటారా? చీర నేసిన వ్యక్తికి ఆ ప్రయాణంలో దాని అందం తెలియదు. దాన్ని ప్రతిసారీ దూరం నుంచి చూసుకుంటూ నేయడు. ఒక అనుభూతితో టకటకా నేసుకుంటూ వెళుతుంటాడు. ప్రస్తుతం నేనలాంటి అనుభూతిలోనే ఉన్నా.
‘అరవింద సమేత’తో ఒక కొత్త రకమైన జోనర్లోకి వెళ్లారు. ఈ సినిమాతో మళ్లీ ఆ దారిని మార్చినట్టు కనిపిస్తోంది. కారణం?
ఎవరైనా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు వాళ్ల ఆలోచనల్ని అందరికీ చెప్పాలి, అది విని వాళ్లంతా మెచ్చుకోవాలి, ఆ ఆలోచనలతో అందరూ ఏకీభవించాలనుకుంటారు. కొన్నాళ్ల తర్వాత జనం కానీ, మీడియా కానీ వీళ్లెలాగూ బాగా చెబుతారు కదా అని మెచ్చుకోవడం తగ్గించేస్తారు. మెచ్చుకోవడం తగ్గడం మూలంగా అవతలివ్యక్తికి మన పనిలో ఏమైనా లోపం ఉందా అని అనుకుంటూ వేరే దారుల్లోకి వెళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయే అవకాశాలుంటాయి. రెండో విషయం.. వాళ్లపై అంచనాలు పెరిగిపోయి చెప్పాలనుకున్నది చెప్పలేక మళ్లీ మామూలుగా, సేఫ్ రూట్లో వెళ్లే ప్రమాదం ఉంది. ఏ రంగంలో ఉన్నవాళ్లయినా ఈ రెండింటినీ ప్రతిసారీ గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. నేనూ ఆ భయాల్ని గెలవాలనే ప్రయత్నిస్తుంటా. ‘అజ్ఞాతవాసి’ పరాజయం తర్వాత అందరూ ‘మీకు అలవాటైన వినోదం వైపు వెళితే ఉత్తమం కదా’ అన్నారు. నేనది చేయలేదు. పరాజయం చూశాక ఇక కొత్తగా భయపడాలా? ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం అని ‘అరవింద సమేత’ చేశా. ఇప్పుడు మళ్లీ అదే కథ చెప్పకూడదు కదా.
ఒక సినిమా చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దర్శకుడిగా మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళుతుందో ఒక అంచనాకొస్తుంటారా?
అలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించను. కథ రాసేంత వరకే దానికి రాజుని నేను. ఆ తర్వాత అది చెప్పినట్టు వినాల్సిందే. అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి కారులో వెళుతుంటే, పక్కన పరిగెత్తుకుంటూ వెళుతున్న కుర్రాడి మీద బురద పడిందని రాసుకున్నాక... ఆ సన్నివేశం కోసం బురద ఉన్న రోడ్డుని వెతకాల్సిందే, రాత్రిపూటచిత్రీకరణ చేయాల్సిందే.
ఇదివరకు మీ సినిమాల్లోని నాయికల పాత్రల విషయంలో విమర్శలొచ్చాయి. ఇటీవల మహిళల పాత్రల్ని గొప్పగా చూపిస్తున్నారు. ఈ మార్పుకి కారణం?
విమర్శ వల్ల వచ్చిన మార్పు కాదిది. ‘ఖలేజా’ సినిమాలో హీరోయిన్ పాత్రని అలా తీర్చిదిద్దానంటే అది వినోదం కోసమే. ఇప్పుడు కూడా మహిళల్ని పొగడటమంటూ ఏమీ లేదు. పుట్టించే శక్తి భూమికీ, ఆడవాళ్లకి ఉందని ఇందులో రాశానంటే అది నిజం కాబట్టి. 1950, 60 వరకు కూడా మనుషులు దూర ప్రాంతాలకి వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చేవరకూ ఆడవాళ్లే కుటుంబాలకి పెద్దగా ఉండేవారు. ఎవరూ చెప్పని మాతృస్వామ్యం. 70వ దశకం తర్వాత వేరే ప్రాంతాలు, దేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేయడం ఎక్కువయ్యాక మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమయ్యాం. మన మూలాల్ని మనం మర్చిపోయాం. ఆడవాళ్లని అగౌరవపరిచేలా చూడటం, వాళ్లూ మౌనంగా ఉండటంతో అదే అలవాటైంది. అలా 35 ఏళ్లు నడిచింది. ఇప్పుడు మళ్లీ మార్పు కనిపిస్తోంది. నాకు మా అత్త అంటే చాలా ఇష్టం. అలాంటి అత్తతో ఎందుకు వేళాకోళమాడాలి? ఎందుకు తెరపై తక్కువ చేసి చూపించాలి? అది మన సంస్కృతిలో లేదు, తీసుకొచ్చి పెట్టారు. అల్లుడిని విష్ణువుగా భావించి పెళ్లిపీటలపై కాళ్లు కడుగుతారు. అలాంటప్పుడు దేవుడిలాగే ఉండాలి. బహుశా ఇలాంటి చికాకులు నాలో ఉండొచ్చు. అందుకే ‘అత్తారికింటి దారేది’ సినిమాని తీశాను.
త్రివిక్రమ్లా రాయాలనీ, త్రివిక్రమ్లా రాశారనే మాటలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంటాయి. ఏదైనా సినిమా చూసినప్పుడు మీలాగే రాసినట్టు అనిపించిందా?
ఎలాంటి బరువు లేకుండా నేను సినిమాల్ని చూస్తుంటా. ఒక దర్శకుడిగా సినిమా కష్టాలు తెలుసు కాబట్టి కొన్ని సన్నివేశాల్ని చూసి ఇదెలా తీశారని ఆశ్చర్యపోతుంటా. ఇంకొన్ని చూసినప్పుడు ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదని ఈర్ష్య కలుగుతుంది. అంతే తప్ప నాలాగా రాశారని నాకెప్పుడూ అనిపించలేదు. ముందు కథ, పాత్రలు, సన్నివేశాలు. ఆ తర్వాతే మాట వస్తుంది. సన్నివేశాల్ని సూటిగా చెప్పడానికి మాట వాడుతుంటానంతే. అందుకే మాటల పరంగా నాకు అంత పేరు వచ్చిందేమో.
చిరంజీవితో సినిమాని ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. నిజమేనా?
చిరంజీవితో సినిమా ఇంకా ఖరారు కాలేదు. ఎన్టీఆర్తో సినిమా అధికారికంగానే ప్రకటిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్తేజ్తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM