తారక్ చాలా సంతోషించాడు..!
‘ఎంత మంచివాడవురా..!’ చిత్రంతో మొదటిసారి సంక్రాంతి బరిలోకి అడుగుపెడుతున్నారు నటుడు నందమూరి కల్యాణ్ రామ్. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్రామ్కు జంటగా మెహరీన్ నటించారు. మొదటిసారి కుటుంబ కథా చిత్రంలో...
‘పటాస్’ అప్పుడే విడుదల చేయాలనుకున్నాం.. కానీ మిస్ అయ్యింది: కల్యాణ్రామ్
హైదరాబాద్: ‘ఎంత మంచివాడవురా..!’ చిత్రంతో మొదటిసారి సంక్రాంతి బరిలోకి అడుగుపెడుతున్నారు నటుడు నందమూరి కల్యాణ్ రామ్. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్రామ్కు జంటగా మెహరీన్ నటించారు. మొదటిసారి కుటుంబ కథా చిత్రంలో నటించడం పట్ల కల్యాణ్రామ్ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్రామ్ సరదాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..
కథ అలా..
‘118’ సినిమా తర్వాత నేను చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనుకున్నాను. ఒకరోజు కృష్ణప్రసాద్ వచ్చి నాకు ఓ గుజరాతీ ఫిల్మ్ చూపించాడు. నాకు ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ నచ్చింది కానీ, మిగిలిన సన్నివేశాలు అంత నచ్చలేదు. ఈ గుజరాతీ సినిమాలోని మెయిన్ పాయింట్ను ఆధారంగా చేసుకుని సతీశ్ ఒక రాశారు ఒకసారి విను అని కృష్ణప్రసాద్ చెప్పారు. అలా సతీశ్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ తర్వాత సతీశ్ కథలో చాలా మార్పులు చేశాడు. ఆగస్టులో షూటింగ్కు వెళ్లాం.
సాంగ్ నుంచి టైటిల్..
సతీశ్ వేగేశ్న సినిమా టైటిళ్లలో తెలుగుదనం ఉంటుంది. ‘శతమానంభవతి’, ‘శ్రీనివాసకల్యాణం’ టైటిళ్లు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా కథ చెప్పినప్పుడు సతీశ్ మొదట ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ పెట్టారు. కానీ నేను మాత్రం తెలుగు టైటిల్ కావాలని అడిగాను. అలా చివరికి ఆయన ‘ఎంత మంచివాడవురా..!’ టైటిల్ పెట్టారు. ‘నమ్మినబంటు’ సినిమాలోని ఓ పాట నుంచి ఈ టైటిల్ వచ్చింది. దానినే మేము మా సినిమా ఫస్ట్ గ్లిమ్స్లో చూపించాం.
రియల్లైఫ్లో ఎలా ఉంటానో అదే..
నేను వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్గా ఉంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కూడా అలాగే ఉంటుంది. చాలా సింపుల్, సరదాగా ఉంటుంది. షూటింగ్కు వెళ్లే ముందు డైరెక్టర్ ఒకటే చెప్పారు. ‘సర్ మీరు ఈ సినిమా మొత్తం సంతోషంగా, నవ్వుతూ ఉండండి’ చాలు అని. ఎమోషనల్, కమర్షియల్ హంగులు ఉన్న సినిమా ఇది.
అప్పుడే అయిపోయిందా..
ఆగస్టులో స్టార్ట్ అయిన మా సినిమా షూటింగ్ 70 రోజుల్లోనే అయిపోయింది. ప్రతిరోజూ షూటింగ్ చాలా సరదాగా గడిచేది. మేము షూట్ చేసిన ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ ఉండేవి కాదు. అందువల్ల సెట్లో అందరం ఫోన్లు పక్కనపెట్టేసి చక్కగా మాట్లాడుకునేవాళ్లం. మళ్లీ హోటల్కి వెళ్లాక ఫోన్లు చూసుకునేవాళ్లం. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు అప్పుడే అయిపోయిందా అనిపించింది. డైరెక్టర్ని ఇంకా కొన్ని సన్నివేశాలు పెట్టమని కోరాను. (నవ్వులు)
కొన్ని సన్నివేశాలు హత్తుకున్నాయి..
చిన్నప్పుడు ఫెస్టివల్స్ సమయంలో మా ఇంటికి పెద్దమ్మ, మామయ్య వాళ్లు వచ్చి వెళ్తుండేవారు. వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు బాగా ఏడుపు వచ్చేసేది. నాకు అందరితో కలిసి ఉండడం అంటే ఇష్టం. ఇప్పటికీ మా ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉంటాం. ప్రతిరోజూ నిద్ర లేవగానే వాళ్లతో కాసేపు కూర్చొని మాట్లాడతాను. ఖాళీ సమయాన్ని వాళ్లతో గడపడానికి ఇష్టపడుతుంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా రియల్ లైఫ్కు దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నన్ను ఎంతగానో హత్తుకున్నాయి.
తారక్కి కథ..
నా భార్య ‘శతమానం భవతి’ సినిమా చూసి.. ‘మీరు ఇలాంటి కుటుంబకథా చిత్రం ఎందుకు చేయరు’ అని ఒకరోజు నన్ను అడిగింది. డైరెక్టర్కి నా మీద నమ్మకం ఉండి అలాంటి కథతో వస్తే తప్పకుండా చేస్తా. నాకు కూడా అలాంటి సినిమా చేయాలని ఉంది అని చెప్పా. ఈ కథ గురించి తారక్కి చెప్పినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తారక్ నేను ఓసినిమా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాకపోతే కొంచెం టైం పట్టింది.
‘పటాస్’ అప్పుడే రిలీజ్ చేద్దామనుకున్నాం కానీ..
‘పటాస్’ సినిమాను మొదట మేము సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది సంక్రాంతికి మిస్ అయ్యింది. ఇదే నా మొదటి సంక్రాంతి సినిమా. మాది కుటుంబకథా చిత్రం కాబట్టి సంక్రాంతికి విడుదలైతే బాగుంటుందని మేము భావించాం. అందుకే ఇప్పుడు విడుదల చేస్తున్నాం.
సతీశ్తో వర్క్..
పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడితో నేను ఎంత సౌకర్యంగా పనిచేశానో.. సతీశ్తో కూడా అలాగే ఉంది. ఒకవేళ సెట్లో నేను టెన్షన్గా కనిపిస్తే.. తను నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు సరదాగా కూర్చొని మాట్లాడేవాడు. జోక్స్ చేసి నన్ను రిలాక్స్ చేసేవాడు. అలాగే మెహరీన్ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. తను కూడా బాగా నటించింది.
ఆ సాంగ్ వింటే..
‘ఏమో ఏమో’ సాంగ్ వింటే ఈ సినిమా అంతా అర్థమవుతోంది. ఈ సినిమాకు తగ్గట్టుగా అందులోని ప్రతి లైన్ ఉంటుంది. ‘నిన్నుకోరి’ సినిమాకు గోపిసుందర్ అందించిన సంగీతం నాకెంతో నచ్చింది. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా