రెండు నెలల్లో ‘కొండారెడ్డి బురుజు’ సృష్టించా
కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్.. ఈ పేరు చెప్పగానే సినీ ప్రియులకు వెంటనే గుర్తుకు వచ్చేది ‘ఒక్కడు’ సినిమాలోని మహేశ్, ప్రకాశ్రాజ్ ఫైటింగ్ సీన్. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్లో.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మహేశ్పై చిత్రీకరించిన విరామ సన్నివేశాలు...
ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్
హైదరాబాద్: కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్.. ఈ పేరు చెప్పగానే సినీ ప్రియులకు వెంటనే గుర్తుకు వచ్చేది ‘ఒక్కడు’ సినిమాలోని మహేశ్, ప్రకాశ్రాజ్ ఫైటింగ్ సీన్. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్లో.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మహేశ్పై చిత్రీకరించిన విరామ సన్నివేశాలు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి. మరి చారిత్రాత్మకమైన ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్ను రామోజీ ఫిల్మ్సిటీలో ఎంతో చక్కగా తీర్చిదిద్దిన ఏఎస్ ప్రకాశ్తో ‘ఈటీవీ’ ముఖాముఖి. ఆ విశేషాలివే..
సంతోషంగా ఉంది..
కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘అల..వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి రెండు పెద్ద ప్రాజెక్ట్ల కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం ఆనందంగా అనిపిస్తుంది.
వర్క్ను ఛాలెంజ్గా తీసుకుని..
అనిల్కి నాకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆయన తెరకెక్కించిన సినిమాలకు నేను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను. అందువల్ల ఆయన టేస్ట్ ఏమిటో నాకు బాగా తెలుసు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కథ గురించి నాకు చెప్పినప్పుడు ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్ గురించి చాలా కీలకంగా చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కర్నూలులోని ‘కొండారెడ్డి బురుజు’ దగ్గర షూటింగ్ చేయలేకపోతున్నామని.. కనుక సెట్ వేద్దామని చెప్పారు. అలా నేను ఈ సెట్ వేయడాన్ని ఒక ఛాలెంజింగ్ తీసుకుని తీర్చిదిద్దాను.
ఆయన ప్రామిస్ నిలబెట్టుకున్నా..
‘కొండారెడ్డి బురుజు సెంటర్’ను సెట్ వేయాలని నిర్ణయించుకున్నాక.. ‘ప్రకాశ్ నువ్వు ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్ సెట్ వేస్తే అది చూసిన ప్రేక్షకులు నిజమనుకోవాలి’ అని అనిల్ అన్నారు. ‘తప్పకుండా సహజంగా అనిపించేలా సెట్ను క్రియేట్ చేస్తాను’ అని అనిల్కు మాట ఇచ్చాను. అందుకే చాలా క్షుణ్ణంగా పరిశీలించాకే సెట్ వేశాను. నేను వేసిన సెట్ చూశాక అనిల్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా మాట నిలబెట్టుకున్నానని చాలాసార్లు అన్నారు.
ఒత్తిడి తెలీదు..
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని కొండారెడ్డి బురుజు సెంటర్ను క్రియేట్ చేయడంలో నేను ఒత్తిడికి లోను కాలేదు. నిజం చెప్పాలంటే నేను ఈ సినిమాకే కాదు ఏ సినిమాకి పని చేసినా ఎలాంటి ఒత్తిడికి గురికాను. ఏ సెట్ వేసినా.. ఒక ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తా. అలాగే దాని గురించి పూర్తిగా స్టడీ చేస్తాం.
అదే మొదటి అడుగు..
అనిల్ రావిపూడి చెప్పగానే మొదట కొండారెడ్డి బురుజు సెంటర్ స్కెచ్ వేశాను. ఆ తర్వాత రెండుసార్లు నేను కర్నూలు వెళ్లి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత మా టీం మొత్తం కలిసి ఐదుసార్లు కర్నూలు వెళ్లి ‘తెలుగు తల్లి సెంటర్’ గురించి పూర్తిగా స్టడీ చేసి ఇక్కడికి వచ్చి సెట్ వర్క్ ప్రారంభించాం.
రెండు నెలల్లోనే..
ఇలాంటి పెద్ద సెట్స్ వేయాలంటే మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుంది. కానీ ఆర్టిస్ట్ల డేట్స్ విషయంలో ఇబ్బంది అవుతుందని అనిల్ చాలా త్వరగా చేయమన్నారు. అలా రెండు నెలల్లోనే ఈ సెట్ను క్రియేట్ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?