ప్లేట్లు కడగడం నుంచి జీవితాన్ని మొదలుపెట్టా
‘‘జానపద కళలు మన వారసత్వ సంపద. వాటిని నాశనం చేసుకుంటున్నాం. కొన్ని జీవితాలు ఛిద్రమవుతున్నాయి. దీని వెనక మార్కెట్ శక్తులున్నాయి. ఆ విషయాన్ని వాణిజ్య ప్రధాన కథతో చెప్పబోతున్నాం’’ అన్నారు కరుణ కుమార్. ఆయన తెరకెక్కించిన చిత్రం...
‘‘జానపద కళలు మన వారసత్వ సంపద. వాటిని నాశనం చేసుకుంటున్నాం. కొన్ని జీవితాలు ఛిద్రమవుతున్నాయి. దీని వెనక మార్కెట్ శక్తులున్నాయి. ఆ విషయాన్ని వాణిజ్య ప్రధాన కథతో చెప్పబోతున్నాం’’ అన్నారు కరుణ కుమార్. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా 6న వస్తోంది. కరుణ కుమార్ విలేకర్లతో మాట్లాడారు.
‘‘తరాలుగా ప్రపంచమంతా జరుగుతున్న కథ ఇది. ఒక సామాజిక సమస్యని వాణిజ్య ప్రధానంగా ఈ చిత్రంతో చెప్పబోతున్నాం. ‘సిటిజన్ కేన్’ సినిమా తరహాలో ఈ కథని మూడు పాత్రలు చెబుతుంటాయి. నిత్యం మనం పత్రికల్లో చదివే సంగతులు, మనం నడుచుకుంటున్న విధానమే ఈ కథలో ప్రతిబింబిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకి కథ మారిపోతుంటుంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది ఈ సినిమాని చూశారు. 25 ఏళ్ల కాలంలో ఇలాంటి కథ రాలేదని చెప్పారు. కచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం ఉంది’’.
* ‘‘మాది పలాస దగ్గరలోని కంట్రగడ. పేదరికంతో 15 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. మద్రాస్ వెళ్లి హోటల్లో ప్లేట్లు కడగడం నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. ఆఫీస్బాయ్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్... ఇలా చాలా పనులు చేశా. తెలియని ప్రాంతం, భాష కావడంతో పుస్తకం ఒక్కటే నాకు అందుబాటులో ఉండేది. అలా సాహిత్యంపై మక్కువ పెరిగింది. క్రమంగా రాయడం అలవాటైంది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఇంటికొచ్చా. జీవనోపాధి కోసం రకరకాల వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ చేరుకున్నా. నేను రాసిన ‘చున్నీ’ అనే కథకి మంచి పేరొచ్చింది. 2016లో స్వచ్ఛభారత్ పోటీల్లో ‘చెంబుకు మూడింది’ అనే లఘు చిత్రం తీస్తే జాతీయ పురస్కారం వచ్చింది. రూ.12 వేలతో తీసిన ఆ చిత్రానికి రూ.5 లక్షల బహుమతి లభించింది. ‘అ!’ సినిమాకి రచనా సహకారం చేశా. మొత్తం 25 చిత్రాలకి పనిచేశా’’.
* ‘‘ఈ చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ పిలిచి కథ అడిగారు. నేను మొదట ప్రేమకథో, థ్రిల్లర్ కథో చేయాలనుకున్నా. ఐదో సినిమాగా ‘పలాస 1978’ చేయాలనుకున్నా. కానీ తమ్మారెడ్డి భరద్వాజ ఈ కథే చేద్దామని చెప్పారు. కథ విన్నాక ఆయన నువ్వు ఇలాగే తీస్తే ‘అంతఃపురం’ని మించిన సినిమా అవుతుందన్నారు. పూర్తయ్యాక చెప్పినట్టే తీశావని మెచ్చుకున్నారు. దర్శకుడు సుకుమార్ మా సినిమాని చూసి వెంటనే చిత్రంలోని ముగ్గురు నటుల్ని తన సినిమాలోని కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. నా రెండో సినిమాని ఆయన సుకుమార్ రైటింగ్స్ సంస్థలో చేయమని అడిగారు. అలాగే అల్లు అరవింద్గారు కూడా సినిమా చేసే అవకాశాన్నిచ్చారు’’.
* ‘‘మొదట మా సినిమాని చూసి సెన్సార్ బోర్డు 25 కట్స్ ఇచ్చింది. దాంతో మేం రివైజింగ్ కమిటీకి వెళ్లాం. అక్కడ రెండు సంభాషణల్ని మాత్రమే తీసేసి విడుదలకి అంగీకారం తెలిపారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!