చెడు అనుభవాలూ ఎదురయ్యాయి
ఇస్మార్ట్ గాళ్...నిధి అగర్వాల్. కుర్రకారు మతులు పోగొట్టేంత అందం ఆమె సొంతం. హిందీ చిత్రం ‘మున్నామైఖేల్’తో వెండితెరకు వచ్చింది. ‘సవ్యసాచి’తో తెలుగులోకి అడుగు పెట్టింది. ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాలతో సందడి చేసింది. త్వరలోనే మరిన్ని
ఇస్మార్ట్ గాళ్...నిధి అగర్వాల్. కుర్రకారు మతులు పోగొట్టేంత అందం ఆమె సొంతం. హిందీ చిత్రం ‘మున్నామైఖేల్’తో వెండితెరకు వచ్చింది. ‘సవ్యసాచి’తో తెలుగులోకి అడుగు పెట్టింది. ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాలతో సందడి చేసింది. త్వరలోనే మరిన్ని చిత్రాలతో అలరిస్తానంటోంది. ప్రస్తుతం బెంగళూరులో గడుపుతున్న నిధిని ‘ఈనాడు సినిమా’ పలకరించింది. ఆమె చెప్పిన విషయాలివీ...
కెరీర్ మొదలైన తక్కువ సమయంలోనే మూడు భాషల్లోకి అడుగు పెట్టారు. ఆయా భాషల్లో వాతావరణం ఎలా ఉంది?
నేను హైదరాబాద్లో పుట్టాను. బెంగళూరులో పెరిగాను. తర్వాత ముంబయికి మారిపోయాను. భిన్నమైన సంస్కృతులతో పరిచయం ఉంది. కాకపోతే భాషతోనే కొంచెం కష్టం. అయినా తెలుగు బాగా మాట్లాడేస్తున్నా. తమిళం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇప్పుడంటే బెంగళూరులో ఇంట్లో ఉన్నాను కానీ, ఐదు రోజులు హైదరాబాద్లో షూటింగ్ చేశానంటే తెలుగు ఇంకా బాగా మాట్లాడేస్తా. తెలుగులో మూడు సినిమాలు చేశాను కాబట్టి సెట్స్లో మాట్లాడుతూనే భాష నేర్చుకున్నా. లాక్డౌన్ విరామంలో తమిళం, తెలుగు సినిమాలు చూడటమే నా పని. పాటలూ వింటున్నా. అయితే తెలుగు ఈమధ్యే నేర్చుకున్నాను కదా, ఇంతలోనే మరో కొత్త భాష తమిళం నేర్చుకోవడంపై దృష్టి పెట్టడంతో కొన్నిసార్లు గందరగోళంగా కూడా ఉంటుంది.
2020 కోసం చాలా ప్రణాళికలే వేసుకుని ఉంటారు కదా...
చాలా అంటే చాలా (నవ్వుతూ). గతేడాది అస్సలు ఖాళీనే లేదు. చిత్రీకరణల కోసం బోలెడన్ని ప్రయాణాలు చేశాను. అందుకోసం 163 విమానాలు మారాను. ఈ ఏడాది కూడా అంతే హుషారుగా మొదలైంది. మే 1కి నా సినిమాల్లో ఒకటి విడుదల కావల్సింది. కానీ ఊహించని రీతిలో కరోనా ప్రభావం మొదలైంది. నావే కాదు, అందరి ప్రణాళికలూ తలకిందులయ్యాయి. నా కెరీర్ మొదలైన రెండున్నరేళ్ల తర్వాత వచ్చిన సుదీర్ఘవిరామమిది.
లాక్డౌన్కి ముందు రెండు రోజులు ఎలా గడిచాయి?
నాకు ఆ రెండు రోజులే గుర్తొస్తున్నాయి (నవ్వుతూ). మళ్లీ అలా స్వేచ్ఛగా బయట గడిపే అవకాశం ఎప్పుడొస్తుందో! ఆరోజు చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చి తిరిగి ముంబయి వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చా. అప్పుడే లాక్డౌన్ ప్రకటించారు. దీంతో బెంగళూరుకి నాప్రయాణాన్ని మార్చుకుని ఇంటికొచ్చేశా.
ముంబయికి ఎందుకెళ్లాలనుకున్నారు?
నేను అక్కడే ఉంటాను. 2017లో సినిమా కెరీర్ కోసం నేను ముంబయికి మారిపోయా. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. లాక్డౌన్ ఎన్ని రోజులో తెలియదు కదా, ఒంటరిగా ఉండటం ఎందుకని బెంగళూరుకు వచ్చేశా.
ఈ విరామంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి?
ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనితో గడిపే ప్రయత్నం చేస్తున్నా. బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. రెండు రోజుల ముందు కొంచెం గొంతు నొప్పి వచ్చింది. దాంతో... ‘ఏమైంది నాకు, ఇప్పుడు ఏం చేయాలి’ అనిపించింది (నవ్వుతూ). ఇది నా ఒక్కదాని సమస్యే కాదు, అందరిదీ. నేనైతే ఇంట్లో ఉన్నాను. కుటుంబం, పెంపుడు కుక్క ఇలా అన్నీ ఉన్నాయి. కానీ బయట ఎంతో మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ల కోసం నా వంతుగా 6 ఛారిటీలకి నా పరిధిలో సాయం చేశా. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా.
‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నారు?
నా జీవితంలో ఓ మంచి మలుపు ఆ సినిమా. నాకు పెద్ద హిట్టు రావడంతోపాటు పూరి సార్, ఛార్మి, రామ్ లాంటి మంచి వ్యక్తులతో అనుబంధం పెరిగింది. ఇప్పుడు వాళ్లు నాకు మంచి స్నేహితులు. హిట్టు సినిమా అయినా, ఫ్లాప్ అయినా నటులు మంచి అభినయమే ప్రదర్శిస్తారు. కాకపోతే ఆ సినిమా హిట్టయితే నటుల కెరీర్కి ప్లస్ అవుతుంది. అది నటులకి చాలా అవసరం. ఈ ప్రయాణంలో నేను గమనించిన మరో విషయం ఏమిటంటే... తొలి సినిమా నుంచి కూడా ఫలితంతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు ట్యాగ్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మరింత హ్యాపీ.
ఇప్పటిదాకా చేసిన పాత్రలతో సంబంధం లేకుండా, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలు వస్తుంటాయా?
నాకు చారిత్రక నేపథ్య సినిమాలంటే చాలా ఇష్టం. నిర్దేశితమైన కాలంలో సాగే ఆ కథల్లో కనిపించే సెట్లు, ఆ గెటప్పులు నన్ను బాగా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తే చేయాలని ఉంది. అలాగే ఓ యాక్షన్ సినిమా కూడా చేయాలి. యాక్షన్లో నాకు ప్రావీణ్యం ఉంది. నా తొలి హిందీ సినిమాని టైగర్ ష్రాఫ్తో కలిసి చేశాను. తనతో కలిసి పోరాటాల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నా. ఆ కళని ఎప్పుడెప్పుడు బయట పెడదామా అనిపిస్తోంది. కామెడీ అన్నా నాకు చాలా ఇష్టం. తమిళంలో చేసిన ‘భూమి’లో నా పాత్ర మంచి వినోదం పండిస్తుంది. తెలుగులోనూ అలాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లాతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకున్నా. హిందీ, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నా.
చిత్ర పరిశ్రమ అర్థం కావడానికి నాకు కొంచెం సమయం పట్టింది. మా కుటుంబంలో ఎవ్వరూ చిత్ర పరిశ్రమలో లేరు. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలా అడుగులు వేయాలో అనుభవాలే నేర్పాయి. కొన్నిసార్లు చెడు అనుభవాలూ ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఇలా ఎందుకు జరిగింది? ఇంత కష్టపడుతున్నా కదా? అనిపిస్తుంటుంది. ఒక తప్పు జరిగాకే, దాన్నుంచి ఒక పాఠం నేర్చుకుంటాం కదా. అలా నేనూ నేర్చుకుంటున్నా’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?