మళ్లీ చిత్రాలు నిర్మిస్తామో లేదో!
‘‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రం రెగ్యులర్ కథతో రూపొందిందే అయినా ఆ కథను నేటి తరానికి తగ్గట్లు కొత్త ట్రీట్మెంట్తో తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి ప్రతిఒక్కరూ చక్కగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత డి.సురేష్బాబు. ఆయన...
‘‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రం రెగ్యులర్ కథతో రూపొందిందే అయినా ఆ కథను నేటి తరానికి తగ్గట్లు కొత్త ట్రీట్మెంట్తో తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి ప్రతిఒక్కరూ చక్కగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత డి.సురేష్బాబు. ఆయన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు తెరకెక్కించారు. రానా సమర్పించారు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రం.. జులై 4 నుంచి ఆహా ఓటీటీలోనూ రానుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా మీడియాతో ముచ్చటించారు సురేష్బాబు.
‘కృష్ణ అండ్ హిస్ లీలా’ కథ ఎంపిక రానాదా? మీదా?
నాది కాదు రానాదే. ఈ ప్రాజెక్టు అనుకున్నాక ‘ఎందుకు దీన్నే ఎంచుకున్నావని’ తనని అడిగా. దానికి తను ‘మా ఫ్రెండ్స్లో చాలా మంది కృష్ణ చేసిన పనినే చేస్తున్నారు. నేటితరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’ని చెప్పాడు.
‘హిరణ్య కశ్యప’ మీ బ్యానర్లో భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ ఏమన్నా తగ్గించబోతున్నారా?
కొన్ని కథలకు ఏం చెయ్యాలో.. ఎంత ఖర్చు పెట్టి చూపించాలో అలాగే చెయ్యాలి. రాజీ పడి స్క్రిప్ట్లోనూ, బడ్జెట్లోనూ మార్పులు చెయ్యకూడదు. ఇలాంటి చిత్రాలన్నీ ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి రప్పించేవి. కాబట్టి వాటిని ఆ స్థాయిలోనే చూపించాలి.
సొంతంగా ఓటీటీ పెట్టే అవకాశముందా?
అది ఖర్చుతో కూడిన వ్యవహారం. పెట్టుబడికి తగ్గట్లుగా రాబడి రావడానికి ఓపిగ్గా ఎదురుచూడాలి. మేం ఓటీటీల్లోకి వస్తామో లేదో వేచి చూడాల్సిందే.
మీ రెండో అబ్బాయి అభిరామ్ తెరంగేట్రం ఎప్పుడు?
ఎప్పుడనేది కచ్చితంగా ఏం చెప్పలేం. ప్రస్తుతానికైతే వాడి కోసం కొన్ని కథలు సిద్ధమవుతున్నాయి.
భవిష్యత్తులో మిమ్మల్ని దర్శకుడిగా చూసే అవకాశమేమైనా ఉందా?
అసలీ ఈ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ చిత్రాలు నిర్మిస్తామో? లేదో? అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంకా దర్శకత్వం కూడానా?. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం. అసలిది ఎప్పటికి అదుపులోకి వస్తుంది? అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏదైనా ఈ కరోనా ప్రభావం నుంచి బయట పడే వరకు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలకు ఇబ్బందుల తప్పవు.
రానా పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయి?
ఒకప్పుడంటే పెళ్లంటే చాలా హడావుడి ఉండేది. ఎంత మందిని పిలవాలి. ఎన్ని కార్డులు పంచాలి అని ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు తగ్గట్లుగా పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యే చేసుకోవాల్సి ఉంది. కాబట్టి పెద్దగా హడావుడి ఏమీ లేదు. ప్రస్తుతానికి చిన్న చిన్న పనులేవో జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా