కత్తిమీద సాము చేశా
సందేశాన్ని... భావోద్వేగాన్ని.. మాస్ని... కలిపి హిట్ ఫార్మలా తయారు చేయగల వెండితెర సైంటిస్ట్ కొరటాల శివ. ‘మంచి కథే చెబుదాం, పెద్ద కథే రాద్దాం...’ అనేది ఆయన తరచూ చెప్పే మాట. ఆ మాటకి తగ్గట్టే ఉంటాయి ఆయన సినిమాలు! హృదయాల్ని హత్తుకునేలా తెరపైన భావోద్వేగాలు పండుతాయి. అభిమానులు గుర్తు పెట్టుకునేలా హీరోయిజాన్ని ఆవిష్కరిస్తుంటారు.
సందేశాన్ని... భావోద్వేగాన్ని.. మాస్ని... కలిపి హిట్ ఫార్మలా తయారు చేయగల వెండితెర సైంటిస్ట్ కొరటాల శివ. ‘మంచి కథే చెబుదాం, పెద్ద కథే రాద్దాం...’ అనేది ఆయన తరచూ చెప్పే మాట. ఆ మాటకి తగ్గట్టే ఉంటాయి ఆయన సినిమాలు! హృదయాల్ని హత్తుకునేలా తెరపైన భావోద్వేగాలు పండుతాయి. అభిమానులు గుర్తు పెట్టుకునేలా హీరోయిజాన్ని ఆవిష్కరిస్తుంటారు. ఆ కథాంశాలు సమాజంలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయి. ఇటీవల చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా ‘ఆచార్య’ తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తన కలను... సినిమా కళగా మార్చి... థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడేలా చేసే అగ్ర దర్శకుడు కొరటాల శివతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
కథ రాయడం పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించేద్దాం అనే ఆత్రుతతో కనిపిస్తుంటారు దర్శకులు. ఈసారి మీ ఆత్రుతను నాలుగేళ్లు ఆపుకోవాల్సి వచ్చింది కదా?
ఎవ్వరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని! కరోనా వల్ల అందరికీ రెండేళ్ల సమయం వృథా అయింది. ప్రయాణం బాగుంటే ఎంత ఆలస్యమైనా ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో పదిలమవుతాయి. ‘ఆచార్య’ రూపంలో ఒక మంచి సినిమా చేశాం, మంచి వ్యక్తులతో ప్రయాణం చేశాం. అందుకే ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదు. కొన్నిసార్లు ఆలస్యమూ సినిమాలకి మేలే చేస్తుంది. ‘ఆచార్య’తోపాటు రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చేశారు. దాంతో డేట్స్ ఇబ్బందిగా ఉండేవి. ‘ఆచార్య’ ఆలస్యం కావడంతో డేట్స్ విషయంలో ఇబ్బంది రాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలకూ తగినంత సమయం దొరికింది.
మధ్యలో కొన్ని సన్నివేశాల్ని రీ షూట్ చేశారట! నిజమేనా?
‘ఆచార్య’ విషయంలో రీ షూట్ అనేది జరగలేదు. అయితే రీ షూట్ అనేది ఓ తప్పు గానో లేదంటే ఫిర్యాదు గానో మాట్లాడుతుంటారు చాలామంది. అది నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఓ సన్నివేశాన్ని ఇంతకంటే బాగా తీయొచ్చు అనే అభిప్రాయం దర్శకుడిలో కలిగిందంటే రీ షూట్కి వెళ్లొచ్చు. అది మంచి విషయం కదా. సన్నివేశం బాగోలేకపోయినా ఇది చాల్లే అనుకోవడం తప్పు అవుతుంది కానీ, ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించడం కోసం రీ షూట్కి వెళ్లడం తప్పు ఎలా అవుతుంది? రీ షూట్ చేసే అవకాశం వస్తే నేను సంకోచించకుండా వెళ్లి నిర్మాతని ఒప్పించి చేస్తాను.
‘ఆచార్య’తో ఏం చెప్పనున్నారు?
ఒక మంచి, పెద్ద కథని చెప్పనున్నాం. వాణిజ్యపరంగా అత్యున్నతమైన అనుభూతినిచ్చే కథ. చిరంజీవి, చరణ్ కలిసి సినిమా చేసినప్పుడు కచ్చితంగా అభిమానులకి కన్నుల పండగలా ఉంటుంది. వాళ్లతోపాటు సినీ ప్రేమికులు ఓ గొప్ప కథని ఆస్వాదించామనే అనుభూతికి గురవుతారు.
ఈ కథ ఎలా పుట్టింది?
యాదృచ్చికంగా వచ్చిన ఓ ఆలోచన నుంచి పుట్టిన కథే ఇది. నాకు చిరంజీవిని చూడగానే ఆచార్య అనే ఫీలింగ్ వస్తుంది. పైగా ఆయన్ని చూస్తూ పెరిగాం. సహజంగానే నేను లార్జర్ దేన్ లైఫ్ తరహా కథల్ని రాస్తుంటాను. నా ఆలోచనలకి ఈసారి అదే తరహా ఇమేజ్ తోడైంది. అక్కడి నుంచి మంచి పాత్రలు, మంచి భావోద్వేగాలు కలిసి ‘ఆచార్య’ కథ అయ్యింది. ఈ సినిమా కోసం రెండు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకున్నా.
చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసిన కథ అన్నమాట?
మొదట ఆయనతో సినిమా అనుకునే కథ రాయడం ఆరంభించా. అయితే ఆయన ఎక్కడా నా కథని ప్రభావితం చేయకూడదు, అదే సమయంలో ఆయన ఇమేజ్కి భంగం కలగకూడదనే అంశాల్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ని సిద్ధం చేశా. సినిమా చూసినప్పుడు ఆయన కోసమే పుట్టిన కథనా? ఈ కథ కోసమే ఆయన ఇందులోకి వచ్చారా? అనేది చెప్పలేని విధంగా, అందంగా కథ, పాత్రలు మిళితమయ్యాయి. ఒక రకంగా ఈ సినిమా కోసం కత్తిమీద సాము చేశా. రెండు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకొని కథని నడపడం ఓ పెద్ద సవాల్గా అనిపించింది. ధర్మస్థలి అనే దేవాలయ నగరి, మరొకటి నక్సలిజం నేపథ్యం. సంబంధం లేని రెండు ప్రపంచాల్ని కలిపే ఆ ఆలోచనే నన్ను ఎంతో ఆత్రుతకి గురిచేసింది. నడిచే బాటలు వేరైనా ధర్మం ముఖ్యం అనే అంశం ఈ కథలో ప్రధానం. ప్రాచీన దేవాలయం ఉన్న ధర్మస్థలి అనే ఊరికి ఓ పెద్దాయన వచ్చి స్థిరపడితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానమైన అంశం. ఓ సినిమా చేసేటప్పుడు సవాళ్లు ఎదురైనప్పుడే ఆ ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి తండ్రి, తనయుడు కనిపించకూడదు, అవొక రెండు అద్భుతమైన పాత్రలే అనిపించాలి. అందుకోసం బాగా కష్టపడ్డాం.
మొదట్లో రామ్చరణ్ అతిథి పాత్రలోనే కనిపిస్తారన్నారు. తర్వాత పూర్తిస్థాయిలోకి మారింది కదా?
ఆయనది నిడివిగల పాత్రే. నేను ఏ పాత్రనైనా నమ్మి, ఆరాధించి రాస్తానే తప్ప కొలతలేసుకుని రాయను. ఇక్కడ ఎంత నిడివితో కనిపిస్తుందనేది ముఖ్యం కాదు, ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేదే కీలకం. రామ్చరణ్ చేసిన సిద్ధ పాత్ర, ఆ ప్రయాణం కథపైనా, ప్రేక్షకులపైనా చాలా ప్రభావం చూపిస్తుంది.
సామాజికాంశాల కథలకు... కథానాయకుల ఇమేజ్తోపాటు వాణిజ్యాంశాల్ని అందంగా మేళవిస్తుంటారు. తొలి సినిమా నుంచే ఆ విషయంలో పట్టు ప్రదర్శించడం మొదలు పెట్టారు. అదెలా సాధ్యమైంది?
సామాజికాంశాలు, సందేశాల్ని దృష్టిలో పెట్టుకుని నేను కథలు చెప్పను. ఒక మంచి వ్యక్తీకరణ, ఓ బలమైన భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించాలనుకుంటాను తప్ప సమాజాన్ని ఉద్ధరించాలని సందేశాల్ని మేళవిస్తూ ఎప్పుడూ కథలు రాసుకోను. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు భావోద్వేగాన్ని అనుభూతి చెందాలనేదే నా లక్ష్యం. హీరో ఊరిని దత్తత తీసుకోవడం అనేది ఓ భావోద్వేగమే తప్ప, దాన్ని సందేశం అనుకోను. ప్రమాణం చేశాను, దానికి కట్టుబడి ఉంటానని ఓ హీరో చెప్పేది అతని భావోద్వేగమే తప్ప సందేశం అనుకోను. ఒకవేళ అక్కడొక బలమైన సందేశం పుట్టి, అది పదిమందికి స్ఫూర్తిగా నిలిచిందంటే బోనస్గా పరిగణిస్తానంతే.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న రామ్చరణ్ సినిమా కదా, దీన్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళతారా? ఈ మార్కెట్పై ఓ దర్శకుడిగా మీ అభిప్రాయం ఏమిటి?
పాన్ ఇండియా అనే పదం ఎందుకో నాకు నచ్చదు. మన దేశంలో ఎప్పుడూ ఇలాంటి సినిమాలే వచ్చాయి. కాకపోతే ఒకప్పుడు ఒక భాషలో ఓ సినిమా బాగా ఆడిందంటే దాని హక్కులు కొనుక్కుని అదే కథని వేరే నటులతో తీసేవాళ్లు. మన కథలు అలా పొరుగు భాషల్లోకి వెళ్లేవి. ఏ భాషలోనైనా అందరం చూసేవి అవే కథల్నే. కాకపోతే ఎక్కడ తీసినా ఆ సినిమానే అన్ని భాషల్లోనూ చూసే వాతావరణం, మార్కెట్ సౌలభ్యం ఏర్పడింది. దర్శకుడిగా మన కథలు అందరికీ నచ్చుతున్నాయనే సంతోషం ఉంది. మంచి కథకులు ఉన్నారిక్కడ అని చాటుకోవడంతోపాటు, మన సినిమా మరో స్థాయికి వెళ్లడం మనందరికీ సంతోషాన్నిచ్చే విషయమే. ఇక ‘ఆచార్య’ని ఏ స్థాయికి తీసుకెళతారనేది నిర్మాతకి సంబంధించిన విషయం.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్తోనూ మీరే సినిమా చేస్తున్నారు. అదీ పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగానే రూపొందుతోందా?
మంచి కథే రాశా. ఎక్కువ మంది చూడాలనే రాస్తాం తప్ప తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఓ కథ, పాన్ ఇండియా మార్కెట్ కోసమైతే మరో కథ అనేదేమీ ఉండదు. పెద్ద, బలమైన కథని రాస్తే సహజంగానే అందరూ చూస్తారు. ఆ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. ప్రస్తుతానికి పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి చిత్రీకరణ కోసం వెళ్లనున్నాం.
తొలిసారి చిరంజీవితో ప్రయాణం ఎలా అనిపించింది?
కళ్ల ముందు మెగాస్టార్ ఉన్నాడనేది, ఆయనతో సినిమా చేస్తున్నామనేదే దర్శకుడు సాధించిన ఓ పెద్ద లక్ష్యం. ఆ ఉత్సాహంతోనే చాలా రోజులు ప్రయాణం చేశా. అందులో ఓ చిన్నపాటి భయమూ ఉంటుంది. ఆ విషయం చిరంజీవికి తెలుసు. వీళ్లంతా మెగాస్టార్తో ఎలా అనే ఒక రకమైన భయంతో ఉంటారని... ఆరంభంలోనే నువ్వు దర్శకుడు, నేను నటుడు అనే అభిప్రాయం కలిగేలా చేస్తారు. ఆయన బలం అది. ప్రయాణాన్ని సున్నితంగా మార్చేస్తారు. యువ హీరోలతో నాకు ఎంత అనుబంధం ఉండేదో, అదే తరహా వాతావరణంలోనే ‘ఆచార్య’ పూర్తి చేశా.
పుస్తక పఠనం మొదట్నుంచీ ఉన్న ఓ అలవాటు. ఈమధ్య ప్రత్యేకంగా జీవిత చరిత్రలు చదువుతున్నా. మనుషులు, వాళ్ల జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా. జీవిత చరిత్ర లనగానే ప్రముఖులే గుర్తుకొస్తారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు వాళ్ల జీవిత అనుభవాలతో పుస్తకాలు రాస్తుంటారు. అలాంటివన్నీ చదువుతున్నా. వాళ్ల కోణాల్లో వాళ్ల అనుభవాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా. మారుమూల రాష్ట్రాల్లో ఎంతో చిత్తశుద్ధితో పనిచేసిన ఓ పోలీస్ అధికారి కథ మనకు తెలిసి ఉండకపోవచ్చు, ఎక్కడో ఓ యోగి కథ మనకు తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ల జీవితాల్లో జరిగే ఆసక్తికరమైన కథలు, వాళ్ల నిర్ణయాలు చదువుతున్నప్పుడు కొన్ని భలే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. మనకు తెలియని ఇన్ని కథలు, ఇన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయా అనిపిస్తుంది. లాక్డౌన్ సమయంలో కొన్ని ఆలోచనల్ని రాసుకున్నా. నా గురించి పుస్తకం రాసుకునే ఆలోచనైతే ఏదీ లేదు. అదృష్టవశాత్తూ మనకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా మన అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తుంటాం కదా!’’
సామాజిక మాధ్యమాల్లో మొదట్నుంచీ నేనంత చురుకేమీ కాదు. ఎందుకో అదనంగా ఓ బ్యాగేజ్తో ఉన్నట్టు అనిపించేది. అందుకే ట్విటర్ నుంచి బయటికి వెళ్లిపోయా. అంతే తప్ప దాని వెనక ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేదు. సామాజిక అను సంధాన మాధ్యమాలు నిజంగా మనకు అందుబాటులో ఉన్న గొప్ప వేదికలు. ఇలాంటి వేదికల్లో మంచితోపాటు చెడూ ఉంటుంది. ఆ చెడుని ఎంత తగ్గించుకుని వాడితే అంత మంచిది. సోషల్ మీడియా దాకా వచ్చామంటే మనమంతా ఎంతో కొంత చదువుకునే ఉంటాం. నలుగురితో ఎలా వ్యవరించాలో తెలిసే ఉంటుంది. అందుకు తగ్గట్టే మసలుకోవాలి. మీమ్స్ చూడండి, ఎంత బాగుంటాయి. అలా జీవితంలో ఫన్ ఉండాలి కానీ, ద్వేషం... ప్రతికూల ఆలోచనలు అనవసరం అనేది నా అభిప్రాయం’’.
మంచి కథలు, నచ్చిన కాన్సెప్టులతో సినిమా నిర్మాణం చేపట్టాలనేది నా ఆలోచన. భవిష్యత్తులో ఎక్కువ సినిమాలు నిర్మిస్తా. కథలు వింటూ ఉన్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)