‘హీరోలకు చోటు లేదిక్కడ’
ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర వీడింది. ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో హీరోలు, విలన్లు ఎవరో తేలిపోయింది. భారీ విజయం సాధించిన ‘ఏక్ విలన్’కి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమా తారాగణాన్ని దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే.
ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర వీడింది. ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో హీరోలు, విలన్లు ఎవరో తేలిపోయింది. భారీ విజయం సాధించిన ‘ఏక్ విలన్’కి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమా తారాగణాన్ని దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే. సోమవారం ఆ పేర్లు బయట పెట్టారు. ఈ సందర్భంగా.. ‘విలన్ల లోకంలో హీరోలకు చోటు లేదు’ అనే ఉపశీర్షికతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు మోహిత్ సూరి. టీ సిరీస్, బాలాజీ టెలీఫిల్మ్స్ నిర్మాణదారులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్