ఆస్ట్రియాలో అలియా పాట

‘తల్లి కానున్నా’ అంటూ ఇటీవలే శుభవార్త వినిపించింది నటి అలియా భట్‌. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్న చిత్రాల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి

Published : 01 Jul 2022 01:17 IST

‘తల్లి కానున్నా’ అంటూ ఇటీవలే శుభవార్త వినిపించింది నటి అలియా భట్‌. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్న చిత్రాల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చివరి పాట చిత్రీకరణ కోసం రణ్‌వీర్‌తో కలిసి ఆస్ట్రియాకు పయనమవుతోంది అలియా. జులై తొలి వారంలో పాట చిత్రీకరణ మొదలవుతుంది. ఇందుకోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాటు చేసింది. ఈ పాట పూర్తయిన వెంటనే అలియా తన హాలీవుడ్‌ సినిమా ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ కోసం లండన్‌ బయలు దేరనున్నట్లు తెలిసింది. ఈ చిత్రమూ ప్రస్తుతం ముగింపు దశలోనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు