నిర్మాతగా చిత్రాంగదా
మోడల్, నటి చిత్రాంగదా సింగ్ నిర్మాతగా మారుతున్నారు. అత్యంత చిన్నవయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి హక్కులు చేజిక్కించుకున్నట్టు
మోడల్, నటి చిత్రాంగదా సింగ్ నిర్మాతగా మారుతున్నారు. అత్యంత చిన్నవయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి హక్కులు చేజిక్కించుకున్నట్టు శనివారం ఆమె తెలిపారు. ‘నిజమైన హీరోలు, మరుగున పడ్డ గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం ఎప్పుడైనా ఉత్సాహభరితంగా ఉంటుంది. వాళ్ల ప్రయాణాన్ని, జీవితాన్ని తెరకెక్కించే అవసరం ఉంది. ‘సూర్మా’ తర్వాత ఇది నా రెండో ప్రయత్నం’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కార్గిల్ యుద్ధంలో అసమాన పోరాటంతో శత్రు మూకల్ని మట్టి కరిపించిన వీరుడు సుబేదార్ యోగేంద్ర యాదవ్. పందొమ్మిదేళ్లకే ఆ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. సీఎస్ ఫిల్మ్స్ దీపక్సింగ్తో సంయుక్తంగా ఈ బయోపిక్ నిర్మించనున్నారు చిత్రాంగదా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?