Alia Bhatt: రాకీ రాణీ కథ ముగిసింది

రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ నాయకనాయికలుగా రూపొందుతున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు. హీరూ జోహార్‌, అపూర్వ మెహతాలతో కలిసి నిర్మిస్తూ.. కరణ్‌జోహార్‌ తెరకెక్కించారు. ఈ చిత్ర షూటింగ్‌ పూరైంది. ఈ సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియోని దర్శకుడు కరణ్‌ జోహార్‌ సోమవారం

Published : 02 Aug 2022 05:55 IST

ణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ నాయకనాయికలుగా రూపొందుతున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు. హీరూ జోహార్‌, అపూర్వ మెహతాలతో కలిసి నిర్మిస్తూ.. కరణ్‌జోహార్‌ తెరకెక్కించారు. ఈ చిత్ర షూటింగ్‌ పూరైంది. ఈ సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియోని దర్శకుడు కరణ్‌ జోహార్‌ సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఈ వేడుకకి కథానాయిక అలియా హాజరు కాలేకపోవడంతో వీడియో కాల్‌ రూపంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘చిత్ర షూటింగ్‌ పూర్తైంది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలవుతాయి. చాలాకాలం తర్వాత దర్శకుడి కుర్చీలో కూర్చోవడం సొంత ఇంటికి వచ్చినంత సంతృప్తిగా ఉంది. ఈ సినిమాతో దిగ్గజాలతో కలిసి పని చేశా. వాళ్లే నా బలం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశారు కరణ్‌. ప్రీతమ్‌ స్వరాలందించిన ఈ సినిమా 2023 ప్రథమార్థంలో థియేటర్లలోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని