Ananya Panday: ఆయుష్‌కు జోడీగా!

‘లైగర్‌’ సినిమా    ప్రచారాల్లో భాగంగా దేశ   వ్యాప్తంగా బిజీగా పర్యటిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకోనుంది.

Updated : 10 Aug 2022 03:22 IST

‘లైగర్‌’ సినిమా ప్రచారాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా బిజీగా పర్యటిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకోనుంది. ఆయుష్మాన్‌ ఖురానా, నౌషరత్‌ బారుచా నటించిన ‘డ్రీమ్‌ గర్ల్‌’ సినిమా ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసింది. దీనికి కొన    సాగింపుగా ‘గ్రీమ్‌ గర్ల్‌ 2’ చిత్రాన్ని తెర   కెక్కించనున్నామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇందులో కథానాయిక ఎవరన్నది పేర్కొనలేదు. బిగ్‌బాస్‌ విన్నర్‌ తేజస్వీ, సారా అలీ ఖాన్‌ తదితరులు పేర్లు ఇటీవల వార్తల్లోకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రబృందం   అనన్యను కలిసినట్లు తెలిసింది. కథ నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా  ఊపినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆయూష్మాన్‌ ఖురానా-అనన్య పాండే కలయికలో ఇదే తొలిచిత్రం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని