ఏప్రిల్‌లో.. ‘టైగర్‌ 3’

బాలీవుడ్‌ చిత్రవర్గాలు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్‌ సోమవారం స్వయంగా ప్రకటించారు. ఇందులో తనకి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మనీశ్‌శర్మ దర్శకుడు. ‘టైగర్‌’ మొదటి భాగం విడుదలై ఆగస్టు 15 నాటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ‘టైగర్‌ 3’ విడుదల తేదీని

Published : 16 Aug 2022 02:44 IST

బాలీవుడ్‌ చిత్రవర్గాలు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్‌ సోమవారం స్వయంగా ప్రకటించారు. ఇందులో తనకి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మనీశ్‌శర్మ దర్శకుడు. ‘టైగర్‌’ మొదటి భాగం విడుదలై ఆగస్టు 15 నాటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ‘టైగర్‌ 3’ విడుదల తేదీని ప్రకటించారు. మొదటి రెండు భాగాలైన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’లకు సంబంధించి గ్లింప్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. మరోవైపు నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ యూట్యూబ్‌లో ఒక ప్రత్యేక గ్లింప్స్‌ వీడియో విడుదల చేసింది. ‘పదేళ్ల కిందట సింహగర్జన చేస్తూ మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అదే ఊపుతో తను ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. వచ్చే ఏడాది ఈద్‌కి థియేటర్లలో టైగర్‌ మీ ముందుంటాడు. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది’ అంటూ అందులో వివరాలు పంచుకుంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ‘భాయీజాన్‌’ వరుసలో ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని