మలి వయసులో సాహసయాత్ర

అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, బొమన్‌ ఇరానీ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఊంఛాయీ’. వయసు మళ్లిన ముగ్గురు స్నేహితులు చేసే సాహస యాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.

Published : 20 Sep 2022 04:59 IST

మితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, బొమన్‌ ఇరానీ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఊంఛాయీ’. వయసు మళ్లిన ముగ్గురు స్నేహితులు చేసే సాహస యాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా, నీనాగుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర రెండో పోస్టర్‌ని సినీవర్గాలు విడుదల చేశాయి. అమితాబ్‌ బచ్చన్‌ ఈ పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మంచు పర్వత సానువుల్లో కూర్చొని మిత్ర త్రయం సేద తీరుతున్నట్టుగా అందులో కనిపిస్తోంది. ‘ఈ రెండో పోస్టర్‌ పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను, నా స్నేహితులను ఆశీర్వదించండి’ అంటూ అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా నవంబరు 11న రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని