మలి వయసులో సాహసయాత్ర
అమితాబ్ బచ్చన్, అనుపమ్ఖేర్, బొమన్ ఇరానీ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఊంఛాయీ’. వయసు మళ్లిన ముగ్గురు స్నేహితులు చేసే సాహస యాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.
అమితాబ్ బచ్చన్, అనుపమ్ఖేర్, బొమన్ ఇరానీ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఊంఛాయీ’. వయసు మళ్లిన ముగ్గురు స్నేహితులు చేసే సాహస యాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా, నీనాగుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర రెండో పోస్టర్ని సినీవర్గాలు విడుదల చేశాయి. అమితాబ్ బచ్చన్ ఈ పోస్టర్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మంచు పర్వత సానువుల్లో కూర్చొని మిత్ర త్రయం సేద తీరుతున్నట్టుగా అందులో కనిపిస్తోంది. ‘ఈ రెండో పోస్టర్ పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను, నా స్నేహితులను ఆశీర్వదించండి’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా నవంబరు 11న రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM