Adipurush: అయోధ్యలో ‘ఆదిపురుష్’ వేడుక
‘ఆదిపురుష్’ టీజర్ విడుదల వేడుకని అక్టోబరు 2న అయోధ్యలో నిర్వహించనున్నారు. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం రౌత్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రామాయణం ఆధారంగా
‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ విడుదల వేడుకని అక్టోబరు 2న అయోధ్యలో నిర్వహించనున్నారు. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం రౌత్ (OmRut) సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) కథానాయకుడు. కృతిసనన్ (Kriti Sanon) కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అవుతున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో టీజర్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఐమాక్స్ ఫార్మేట్తోపాటు, త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ