Adipurush: అయోధ్యలో ‘ఆదిపురుష్‌’ వేడుక

‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదల వేడుకని అక్టోబరు 2న అయోధ్యలో నిర్వహించనున్నారు. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రామాయణం ఆధారంగా

Updated : 28 Sep 2022 07:05 IST

‘ఆదిపురుష్‌’ (Adipurush) టీజర్‌ విడుదల వేడుకని అక్టోబరు 2న అయోధ్యలో నిర్వహించనున్నారు. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ (OmRut) సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడు. కృతిసనన్‌ (Kriti Sanon) కథానాయిక.  సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అవుతున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో టీజర్‌ని విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఐమాక్స్‌ ఫార్మేట్‌తోపాటు, త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని