మణిరత్నం ‘బొంబాయి’కు 25ఏళ్లు!
అద్భుత దృశ్య కావ్యాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం. ఆయన సినిమా ఓ మ్యాజిక్. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర
అద్భుత దృశ్య కావ్యాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం. ఆయన సినిమా ఓ మ్యాజిక్. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర దండమేదో ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా, దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్లుగా మిగిలాయి. అరవిందస్వామి కథానాయకుడిగా మణిరత్నం ‘రోజా’ తీశారు. జాతీయ స్థాయిలో పేరు మార్మోగిపోయింది. ఆ మరుసటి ఏడాది ‘దొంగా దొంగా’ తీశారు. కమర్షియల్గా ఘన విజయాన్ని అందుకుంది. కానీ, మణిరత్నం ఈసారి పెద్ద సబ్జెక్ట్నే చేపట్టారు. అది అలాంటి ఇలాంటి సబ్జెక్ట్ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా, దేశం అల్ల కల్లోమైపోతుంది. అలాంటి సబ్జెక్ట్ను తీసుకున్నారు. అదే ‘బొంబాయి’ సినిమా. 1995 మార్చి 10న విడుదలైన ఈ చిత్రం నేటితో 25ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఏంటీ బొంబాయి కథ!
శేఖర్(అరవింద స్వామి)ది ఆచారాలు, సంప్రదాయాలు పాటించే కుటుంబం. ముంబయిలో జర్నలిస్ట్గా పనిచేస్తుంటాడు. ఒకసారి ఊరు వచ్చిన అతను అనుకోకుండా ముస్లిం యువతి షైలా భాను(మనీషా కొయిరాలా)ను చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తపరుస్తాడు. అయితే, మొదట ఆమె శేఖర్ను దూరంగా పెడుతుంది. అతని ప్రేమలో నిజాయతీని అర్థం చేసుకుని తనూ ప్రేమించటం మొదలు పెడుతుంది. ఈ విషయంలో ఇరువురి ఇళ్లలో తెలిసి గొడవ జరుగుతుంది. చివరకు షైలా భాను తను ప్రేమించిన శేఖర్ కోసం ఇల్లు విడిచి ముంబయి వెళ్లిపోతుంది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వారికిద్దరు పిల్లలు పుడతారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులకు కోపాలు తగ్గి శేఖర్, షైలా భానులను చూడటానికి ముంబయి వస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మత ఘర్షణలు చెలరేగుతాయి. వాటి వల్ల ఎంతమంది నష్టపోయారు. శేఖర్ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? చివరకు ఆ గొడవలు ఎలా సద్దుమణిగాయన్నది ‘బొంబాయి కథ’.
విక్రమ్ చేయాల్సింది కానీ..
మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ముంబయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాన్ని తీసుకుని సినిమా తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ప్రముఖ మళయాళ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ను కథ, కథనాలను సిద్ధం చేయమని కోరారు. కానీ, అది ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు తానే కూర్చొని కథను సిద్ధం చేసుకుని ఓ తమిళ సినిమాగా చేయాలని అనుకున్నారు. తొలుత ఈ సినిమా కోసం విక్రమ్, మనీషా కొయిరాలాలకు ఫొటో షూట్ చేశారు. అయితే, అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం, మీసం పెంచిన విక్రమ్ దాన్ని తొలగించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ‘రోజా’లో చేసిన అరవిందస్వామిని తీసుకున్నారు. ఇక నాజర్ను నారాయణమూర్తి పాత్రకు, రాజా కృష్ణమూర్తి(కిట్టు)ను బషీర్ పాత్రకు తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్గా రాజీవ్ మేనన్ను ఎంపిక చేశారు. అరవిందస్వామి, మనీషా కొయిరాలాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను వర్షంలో తీయాలన్న ఆలోచన ఆయనదే. పొల్లాచి, కాసర్గోడ్, కన్నూర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ పాటను ‘తిరుమల నాయక్కర్ మహల్’లో తీశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వీడియోను ప్రసారం చేసేందుకు సెన్సార్బోర్డు ఒప్పుకోలేదు. దీంతో పత్రికలు, ఫొటోలను మాత్రమే చిత్రంలో చూపించారు.
విడుదల.. వివాదాలు.. విజయం..
సెన్సార్ బోర్డు సభ్యులకు, మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయనేతలకు సినిమా ప్రివ్యూ వేసి చూపించారు. అందరికీ సినిమా నచ్చింది. టినూ ఆనంద్ పాత్ర బాల్ ఠాక్రేలా పోలి ఉండటంతో కొన్ని సన్నివేశాలకు కత్తెరపడింది. దాంతో ఆ పాత్ర చాలా తక్కువ ఫ్రేమ్లో మాత్రమే కనిపిస్తుంది. హిందీలో అమితాబ్ బచ్చన్ కంపెనీ ఏబీసీఎల్ రూ.2.5కోట్లు చెల్లించి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ‘బొంబాయి’ చిత్రాన్ని 1995 మార్చి 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. తొలినాళ్లలో హైదరాబాద్, హుబ్లీ, ధార్వాడ్, ఉత్తర కర్ణాటక సహా పలు చోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్లో థియేటర్లపై దాడి జరిగింది. తమ మనోభావాలను కించ పరిచేలా చిత్రం ఉందని ఓ వర్గం ఆరోపించింది. కానీ, అవేవీ మణిరత్నం మ్యాజిక్ముందు పనిచేయలేదు. వరుసగా అందరూ సినిమా చూడటం మొదలు పెట్టారు. అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అందరూ అదరగొట్టేశారు!
శేఖర్గా అరవిందస్వామి, షైలా భానుగా మనీషా కొయిరాలా చక్కగా నటించారు. వెండితెరపై వారి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రేమికులుగా, భార్యాభర్తలుగా వారి జోడీ మెప్పించింది. నారాయణమూర్తిగా నాజర్.. బషీర్గా కిట్టూలు కూడా అలరించారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తెలుగు నటుడు రాళ్లపల్లి గురించి. ట్రాన్స్జెండర్గా ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా శేఖర్-షైలా భానుల కొడుకును కాపాడేందుకు ఆందోళనకారులపై ఆయన చేసే పోరాటం మెప్పిస్తుంది. చిన్నారుల నటన కూడా కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ‘ఉరికే చిలకా..’, ‘కన్నానులే కలయికలు..’, ‘హమ్మా.. హమ్మా’ సాంగ్లు శ్రోతలను విశేషంగా అలరించాయి. వెండితెరపైనా వాటి చిత్రీకరణ ఆకట్టుకుంది. దర్శకుడిగా మణిరత్నం పేరు మార్మోగిపోయింది.
అవార్డులు
‘బొంబాయి’ సినిమాను జాతీయ అవార్డు సహా అనేక అవార్డులు వరించాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్దత్ అవార్డును మణిరత్నం అందుకున్నారు. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సురేశ్కు జాతీయ అవార్డు వచ్చింది. రెండు ఫిల్మ్ ఫేర్లు, నాలుగు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు, మరాఠీ శ్రీ, రెండు తమిళనాడు స్టేట్ అవార్డుల సహా పలు అవార్డులు వచ్చాయి. ఎడిన్బర్గ్ ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గాలా అవార్డు వరించింది. అమెరికాలో నిర్వహించిన పొలిటికల్ ఫిల్మ్ సొసైటీ అవార్డ్స్లో స్పెషల్ అవార్డు లభించింది. జెరూసలేం ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విమ్ వాన్ లీర్ ఇన్ స్పిరిట్ ఫర్ ఫ్రీడమ్ అవార్డు’ను సైతం మణిరత్నం అందుకున్నారు.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్దత్ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు