www: ఓటీటీలోకి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’

అదిత్‌ అరుణ్‌, శివాని  రాజశేఖర్‌ జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). రవిప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో

Published : 05 Dec 2021 15:35 IST

దిత్‌ అరుణ్‌, శివాని  రాజశేఖర్‌ జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). రవిప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనిలివ్‌’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘తొలిసారి తెలుగులో వస్తున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి సరిగ్గా సరిపోతుంది. ఈ సినిమా సోనిలివ్‌ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్‌ మేకింగ్‌, అదిత్‌ అరుణ్‌ - శివానిల కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ సినిమాకి కూర్పు: తమ్మిరాజు, మాటలు: మిర్చి కిరణ్‌. సమర్పణ: సురేష్‌ ప్రొడక్షన్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని