కోలీవుడ్లో నూతన సంవత్సర సందడి
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. కొందరు కేక్ కోసి సంబరాలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
హీరోల ప్రత్యేక పోస్టర్ల విడుదల
కేక్ కోసి సంబరాలు చేసిన చిత్ర బృందాలు
కోడంబాక్కం: ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. కొందరు కేక్ కోసి సంబరాలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. నటుడు విక్రం ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేయగా నటుడు విక్రం చిత్ర బృందానికి కేక్ తినిపించారు. అదేవిధంగా ‘మరిజువానా’ చిత్ర బృందం కూడా ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేక్ కోసం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు ఎండీ ఆనంద్ మాట్లాడుతూ ‘‘మరిజువానా’ అంటే గంజాయి మొక్కకు శాస్త్రీయ నామం. గంజాయితో యవత ఎలా పెడదారి పెడుతోందన్నదే చిత్ర కథ. నగరంలో యువకుల జీవితాలను ఈ గంజాయి మార్చేస్తోంది. ఈ అంశంతో సినిమాను రూపొందించాం. ఇందులో పనిచేసినవారంతా యువకులే. ఇందులో ‘అట్టు’ ఫేమ్ రిషి రిత్విక్ హీరోగా నటిస్తున్నారని’ పేర్కొన్నారు. ఆశా కథానాయికగా నటిస్తోంది. రిషి రిత్విక్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్కు వెళ్లొచ్చింది. అయితే సినిమాలో దాదాపు 52 కట్లు చేస్తే ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ కథలో ఉన్న వాస్తవికత పోతుందనే కారణంతో ‘ఏ’ సర్టిఫికెట్తో చిత్ర బృందం బయటకు వచ్చింది.
విజయ్ ఫస్ట్లుక్..
ఖైదీతో గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను కొత్త సంవత్సరం కానుకగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మాస్టర్’ అని టైటిల్ పెట్టారు. ఇది విజయ్కి 64వ చిత్రం. ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు పోస్టర్లో ప్రస్తావించారు. ఇందులో విజయ్ కళాశాల ఆచార్యుడిగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇక సూర్య హీరోగా నటిస్తున్న ‘సూరరై పోట్రు’ సినిమా సెకెండ్ లుక్ను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఓ పక్షిపై సూర్య ముఖం ఉన్నట్లు ఫస్ట్లుక్ను రూపొందించారు. ఈ నెల 7వ తేదీన టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు నటుడు సంతానం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన ‘డకాల్టి’ సినిమాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.
2020 విద్యార్థులతో...
వైవిధ్యానికి మారు పేరుగా ఉండే పార్తిబన్.. కొత్త సంవత్సర వేడుకల్లోనూ వైవిధ్యాన్ని కనబరిచారు. 2020 మంది విద్యార్థులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అందరితో కలిసి కేక్ కోసి బెలూన్లు ఎగురవేశారు. వారికి బహుమతులు అందజేసి కలిసి భోజనం చేసినట్లు పార్తిబన్ పేర్కొన్నారు. అదేవిధంగా బుల్లితెర నటీనటుల సంఘంలో సభ్యులకు ప్రత్యేక కానుకల అందజేత కార్యక్రమం జరిగింది. నటుడు మనోబాలా ముఖ్య అతిథిగా విచ్చేసి కొత్త దుస్తులు, మిఠాయిలు, బహుమతులు పంచి పెట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రవివర్మ మాట్లాడుతూ.. దాదాపు 16 సంవత్సరాలుగా నూతన సంవత్సరం రోజున సభ్యులకు కానుకలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంఘంలోని 1800 మందికి కానుకలు ఇస్తామని ప్రకటించారు.
పారిశుద్ధ్య కార్మికులతో..
నటి గౌతమి ‘లైఫ్ అగైన్’ అనే ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు తనవంతు సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలను పలువురు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వారికి కొత్త దుస్తులు అందజేసి సంతోసంగా గడిపారు. ‘అందరికీ కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నింటినీ మరిచిపోయి సంతోషంతో, ఆరోగ్యంతో జీవించాలి. నూతన సంవత్సర వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు లేక మేము లేదు’ అని గౌతమి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్