మహేశ్‌ను టార్గెట్‌ చేసిన రష్మిక ఫ్యామిలీ..!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబును రష్మిక, ఆమె ఫ్యామిలీ టార్గెట్‌ చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక..

Published : 05 Jan 2020 22:30 IST

అనిల్‌ రావిపూడి ఏమన్నారంటే..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబును రష్మిక, ఆమె ఫ్యామిలీ టార్గెట్‌ చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనిల్‌రావిపూడి విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. 

‘ఈ సినిమాలో రైలులో జరిగే ఓ ఎపిసోడ్‌ చాలా ఫన్నీగా ఉండనుంది. ట్రైన్‌ ఎక్కిన దగ్గర నుంచి మహేశ్‌ను రష్మిక, ఆమె కుటుంబం ఎలా టార్గెట్ చేశారు, అందులో వచ్చే ఫన్‌ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. బండ్లగణేశ్‌ ఈ సినిమాలో ఓ దొంగ పాత్రలో కనిపించ నున్నారు. ట్రైన్‌ దోచుకోడానికి వచ్చిన ఓ దొంగగా బండ్ల గణేశ్‌ పాత్ర చాలా ఫన్నీగా ఉంటోంది.’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు. అనంతరం బండ్లగణేశ్‌ గురించి అనిల్‌మాట్లాడుతూ.. ‘బండ్ల గణేశ్‌ చాలా మంచి మనిషి. ఆయనతో షూటింగ్‌ చాలా సరదాగా గడిచింది. కొన్నిసార్లు మహేశ్‌ ఆయన్ని సరదాగా ఆటపట్టించేవారు. మహేశ్‌ టీజ్‌ చేస్తుంటే గణేశ్‌ డైలాగులు మర్చిపోయేవారు.’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని