ఈ జోడీకి ‘సరిలేరు ఇంకెవ్వరు’
వెండితెరపై కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ వాళ్లు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి జోడీ చిరంజీవి-విజయశాంతి. వీరి కలిసి నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని
వెండితెరపై కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ వాళ్లు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి జోడీ చిరంజీవి-విజయశాంతి. వీరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. చిరంజీవి అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, విజయశాంతి కూడా లేడీ సూపర్స్టార్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. చిరు ‘ఖైదీ నంబర్ 150’తో తిరిగి రీఎంట్రీ ఇవ్వగా, విజయశాంతి తాజాగా మహేశ్ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్ర ‘మెగా సూపర్’ ఈవెంట్లో ఈ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘విడుదల ముందస్తు వేడుకలో చిరంజీవిని కలవడం గొప్ప అనుభూతి. నేను రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవికీ, నాకూ మధ్య దూరం పెరిగింది. ఆ వేడుక తర్వాత మా మధ్య అపార్థాలన్నీ తొలగిపోయాయి’ అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని హిట్ సినిమాలేంటో ఓసారి చూద్దామా!
గ్యాంగ్ లీడర్
చిరు-విజయశాంతి జోడీ అనగానే అభిమానులకు మొదటిగా గుర్తొచ్చేది ‘గ్యాంగ్లీడర్’. ఇందులో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు భలే సరదాగా ఉంటాయి. ఇక ‘వాన వాన వెల్లువాయే ’పాటలో వీరి స్టెప్లు కుర్రకారుకు తెగ నచ్చేశాయ్. చిరు చెప్పే ‘చేయి చూశావా చాలా రఫ్ఫ్గా ఉందో.. రఫ్ఫాడ్డించేస్తా’ అనే డైలాగ్ చాలా పాపులర్. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. 1991లో విడుదలైన ‘గ్యాంగ్లీడర్’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలకొట్టింది.
స్వయం కృషి
కళాతపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ స్యయంకృషి.’ ఇందులో చిరు-విజయశాంతి అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. చిరంజీవి నటనకుగానూ తొలిసారి నంది అవార్డును అందుకున్నారు. ఇందులోని గీతాలు సంగీత ప్రియులని విశేషంగా అలరించాయి. ఈ సినిమాని మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొండవీటి దొంగ
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మరో కమర్షియల్ బ్లాక్బస్టర్ చిత్రం ‘కొండవీటి దొంగ’. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాబిన్హుడ్ కథ స్ఫూర్తితో తెరకెక్కించారు. ఇందులో మెగాస్టార్కు జోడీగా విజయశాంతి, రాధ నటించారు. ‘కోలో కోలమ్మ కళ్ల కోకే కాకెత్తుకెళ్ల కోరింది ఇచ్చుకోవా’లో చిరు-విజయశాంతి స్టెప్లను ఎవరూ మర్చిపోలేరు.
యముడికి మెగుడు
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి-విజయశాంతి జోడీగా నటించిన చిత్రం ‘యముడికి మెగుడు’. 1988లో విడుదలైన ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది. రాజ్ - కోటి సంగీతం, యమలోకంలోని సన్నివేశాలు ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ‘వాన జల్లు..’ పాట యువతకు మత్తెక్కించింది.
పసివాడి ప్రాణం
చిరు కెరీర్లోనే థ్రిల్లర్ సినిమాగా ఆకట్టుకున్న చిత్రం ‘పసివాడి ప్రాణం. కొదండరామి రెడ్డి దర్శకుడు. ఈ సినిమాతోనే ప్రముఖ నటుడు రఘువరన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. అల్లు అరవింద్ నిర్మాత. 1987లో విడుదలైన ఈ సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది. తెలుగులో థ్రిల్లర్ సినిమాల హావాకు నాంది పలికింది. ఇందులోని ‘కశ్మీరు లోయలో కన్యాకుమారి’ , ‘బ్రేక్ డాన్స్ ’ పాటలకు చిరు-విజయశాంతిల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఛాలెంజ్
యండమూరి నవల ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ ఛాలెంజ్’. యండమూరి-చిరు కలయికలో వచ్చిన చిత్రాలన్ని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అందులో ఇది కూడా ఒకటి. కొదండరామి రెడ్డి దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందించాడు. చిరుతో పాటుగా విజయశాంతి, సుహాసిని నటించారు. ఇందులో చిరు రావుగోపాలరావుతో డబ్బు సంపాదించే విషయంపై ఛాలెంజ్ చేసే సన్నివేశం హైలైట్గా నిలిచింది. 1984లో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది చిత్రం.
కొండవీటి రాజా
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రాల్లో ‘కొండవీటి రాజా’ ఒకటి. ఇందులో చిరు-విజయశాంతి మధ్య వచ్చే గీతాలలో నృత్యాలతో పాటు రాఘవేంద్రరావు మార్క్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చింది. నిధి అన్వేషణ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు.
ఇవే కాదు, ‘మెకానిక్ అల్లుడు’, ‘స్టువర్ట్పురం పోలీస్స్టేషన్’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘యుద్ధభూమి’, ‘చాణక్య శపథం’, ‘ధైర్యవంతుడు’, ‘భాగ్యలక్ష్మి’, ‘దేవాంతకుడు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘రుస్తుం’ చిత్రాలు వీరి కాంబినేషన్లోప్రేక్షకులను అలరించాయి.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని