అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఆయన చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు.....

Updated : 21 Jan 2020 08:08 IST

ప్రణబ్‌ చేతుల మీదుగా అవార్డు

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఆయన చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ గౌరవం అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన  చిత్రాలు విజయం సాధించాయి. గత ఏడాది ‘గీత గోవిందం’, ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో..’ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని