‘చందమామ’ మైనపు బొమ్మను చూశారా..!!

టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ మైనపు విగ్రహాం కొలువుదీరింది. ఈ మేరకు సింగపూర్‌కు చేరుకున్న కాజల్ బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన కుటుంబసభ్యులతో...

Updated : 05 Feb 2020 12:34 IST

నెటిజన్లను ఆకట్టుకున్న పంచదార బొమ్మ

సింగపూర్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ మైనపు విగ్రహాం కొలువుదీరింది. ఈ మేరకు సింగపూర్‌కు చేరుకున్న కాజల్ బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో ఉన్న కాజల్‌ మైనపు బొమ్మ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాజల్‌ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్‌ నటిస్తున్నారు.  దీంతోపాటు శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌2’ సినిమాలో కాజల్‌ సందడి చేయనున్నారు. హిందీలో ‘ముంబయిసాగా’లో నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని