ధనుష్‌ తర్వాతి చిత్రంలో నిత్యా మేనన్‌

ధనుష్‌తో నిత్యా తొలిసారిగా కలిసి నటించనుంది...

Updated : 19 Oct 2022 15:54 IST

చెన్నై: ఇటీవల విడుదలైన తన తమిళ చిత్రం ‘సైకో’ విజయాన్నందుకోవటంపై నిత్యామేనన్‌  హర్షం వ్యక్తం చేస్తోంది. తన తరువాతి ప్రాజెక్టుల గురించి నిత్య మాట్లాడుతూ...‘‘ఇది నా కెరీర్లోనే అద్భుతమైన దశ. ఈ సంవత్సరం నా చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. వాటిలో ధనుష్‌తో కలసి నటిస్తున్న చిత్రం ఒకటి. నేను ధనుష్‌తో నటిస్తున్నానని తప్ప ఆ ప్రాజెక్టును గురించి ఇంకే వివరాలు చెప్పలేను.’’ అన్నారు. కాగా ధనుష్‌తో నిత్య తొలిసారిగా కలిసి నటించనున్న ఈ చిత్రం జూన్‌ లేదా జులైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 

గత ఆగస్టులో విడుదలైన ‘మిషన్‌ మంగళ్‌’తో నిత్య బాలీవుడ్‌లో కాలుమోపింది. ఆపైన అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ‘బ్రీత్‌’ వెబ్‌ సిరీస్‌ రెండో భాగంలో నటించింది. ఇవే కాకుండా జయలలిత బయోపిక్‌ - ‘ద ఐరన్‌ లేడీ’ గురించి కూడా నిత్య ఆతృతగా ఎదురుచూస్తోంది.

ఇక శశి దర్శకత్వంలో నిత్య నటించిన తెలుగు చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. కాగా ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించాల్సి ఉంది. అశోక్‌ సెల్వన్‌, రితూ వర్మ ఇతర నటీనటులుగా ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ యూరోప్‌లోని అద్భుతమైన లొకేషన్లలో జరిగిందట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు