తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌

కథానాయకుడు అల్లు అర్జున్‌ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీనివాసుడిని దర్శించుకుని

Updated : 07 Feb 2020 14:53 IST

హైదరాబాద్‌: కథానాయకుడు అల్లు అర్జున్‌ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీనివాసుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా తిరుమలకు విచ్చేశారు.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని