సాయితేజ్‌ ట్వీట్‌.. మంచు విష్ణు కౌంటర్‌

‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు నటుడు సాయితేజ్‌. తాజాగా ఆయన పెట్టిన ఓ ట్వీట్‌కు మరో టాలీవుడ్‌ కథానాయకుడు మంచు విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. ఇంకా ఎన్నిరోజులు నువ్వు ఇలా ఉంటావో నేను చూస్తా అని సాయి తేజ్‌ను ఉద్దేశిస్తూ.. విష్ణు అన్నారు..

Updated : 08 Feb 2020 12:58 IST

నువ్వు ఎన్నిరోజులు అలా ఉంటావో నేను చూస్తా

హైదరాబాద్‌: ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు నటుడు సాయితేజ్‌. తాజాగా ఆయన పెట్టిన ఓ ట్వీట్‌కు మరో టాలీవుడ్‌ కథానాయకుడు మంచు విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. ఇంకా ఎన్నిరోజులు నువ్వు ఇలా ఉంటావో నేను చూస్తా అని సాయి తేజ్‌ను ఉద్దేశిస్తూ.. విష్ణు అన్నారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం సాయితేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సాయితేజ్‌కు జంటగా నభానటేశ్‌ కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘సోలో బ్రతుకే సో బెటరు’ ప్రమోషన్స్‌లో భాగంగా సోలోగా ఉంటే వచ్చే లాభాలను తెలియచేస్తూ సాయితేజ్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’గా నేను జీవితాన్ని లీడ్‌ చేస్తున్నాను. ఎందుకంటే..

1. ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోతే నేను పెద్దగా టెన్షన్‌ పడను.

2. రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌కి మాత్రమే నేను డబ్బులు చెల్లిస్తాను. (పర్స్‌కు బొక్కపడే ఛాన్సేలేదు)

3. క్రికెట్‌ ఆడేటప్పుడు కాల్‌ వచ్చి గేమ్‌ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.

4. షూట్‌, క్రికెట్‌, జిమ్‌, ఇల్లు, స్నేహితులు... నాకు నచ్చినవాళ్లతో నచ్చినంత సమయాన్ని గడపవచ్చు. 

సింగిల్‌ ఆర్మీ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. #WhySoloBrathukeSoBetter #SinglesSwag అనే హ్యాష్‌ట్యాగ్‌లతో మీ సింగిల్‌ జీవితాలను గురించి తెలియచేస్తూ కామెంట్‌ చేయండి.’ అని సాయితేజ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సాయితేజ్‌ ట్వీట్‌ చూసిన మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా.. ‘తమ్ముడూ సాయితేజ్.‌. నువ్వు పెట్టిన ఈ ట్వీట్‌ను నేను సేవ్‌ చేసుకున్నా. ఇంకా ఎన్నిరోజులు సోలోగా ఉంటావో చూస్తాగా. ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అని సరదాగా కామెంట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని