హీరో విజయ్‌కు ఐటీ సమన్లు

పన్ను చెల్లించనందుకు తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు ఆదాయ పన్నుశాఖ సమన్లు జారీ చేసింది. చెన్నైలోని విజయ్‌ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయ్‌కు..

Published : 10 Feb 2020 21:15 IST

చెన్నై: ఆదాయ పన్ను చెల్లించనందుకు తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు ఆదాయ పన్నుశాఖ సమన్లు జారీ చేసింది. చెన్నైలోని విజయ్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్న అన్బూ ఇంట్లోనూ దాడులు చేసిన అధికారులు రూ.65కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయ్‌ హీరోగా నటించిన బిగిలే (విజిల్‌) ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.300కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో ఐటీ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విజయ్‌ ప్రస్తుతం ‘మాస్టర్‌’ చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మాళవిక మోహన్‌ హీరోయిన్. ఆండ్రియా, శాంతను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్‌ శ్రీకాంత్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 10న అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం యోచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని