గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న వి.వి.వినాయక్‌

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వి.వి.వినాయక్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి...

Published : 16 Feb 2020 14:12 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వి.వి.వినాయక్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతిఒక్క భారతీయుడు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని