థియేటర్లు దొరక్క విడుదల వాయిదా

త్రిష ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం పరమపదం విలయవట్టు. ఫిబ్రవరి 28 విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడం వల్లే సినిమా

Published : 27 Feb 2020 22:25 IST

చెన్నై: త్రిష ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం పరమపదం విలయవట్టు. ఫిబ్రవరి 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాను మార్చిలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం యోచిస్తోంది. విడుదలకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాతో యువ డైరెక్టర్‌ తిరుజ్ఞానం కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో త్రిష వైద్యురాలైన తల్లి పాత్రలో కనిపించనుంది. మనస్వి, అజగప్పన్‌, నంద, రిచర్డ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డీఎంవై క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. అమృత్‌ సంగీతం అందించారు. మరోవైపు సినిమా ప్రచార కార్యక్రమాల్లో త్రిష పాల్గొనకపోవడంతో ఆమె తీసుకున్న పారితోషికం తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్మాణ సంస్థ త్రిషను కోరినట్లు తెలుస్తోంది. అభిమానులు త్రిషను చూసే సినిమాకు వస్తారని, పైగా ఈ చిత్రంలో హీరో కూడా లేరని నిర్మాణ సంస్థ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని