వారసురాళ్లు.. ఇప్పుడయ్యారు హీరోయిన్లు..!
కుటుంబం పేరు చెప్పుకుని చిత్ర పరిశ్రమకు రావడం సులభం. కానీ స్టార్గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఓర్పు, శ్రమ, పట్టుదల ఉంటే తప్ప ప్రేక్షకుల మన్ననలు దక్కవు. ఇలా కుటుంబ నేపథ్యంతో పరిశ్రమకు వచ్చినప్పటికీ.. శ్రమతో వెండితెరపై తమదైన ముద్రను వేసుకుంటున్నారు ముద్దుగుమ్మలు.....
కుటుంబం పేరు చెప్పుకొని చిత్ర పరిశ్రమకు రావడం సులభం. కానీ, స్టార్గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఓర్పు, శ్రమ, పట్టుదల ఉంటే తప్ప ప్రేక్షకుల మన్ననలు దక్కవు. ఇలా కుటుంబ నేపథ్యంతో పరిశ్రమకు వచ్చినప్పటికీ.. శ్రమతో వెండితెరపై తమదైన ముద్ర వేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. చక్కటి అభినయం, అందంతో ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రుతి హాసన్, కరీనా కపూర్, ఆలియా భట్, సోనమ్ కపూర్ తదితరులు ఈ కోవకు చెందిన వాళ్లే. ఇప్పుడిప్పుడే మరికొందరు వారసురాళ్ల అడుగులు ఇటువైపు పడుతున్నాయి. నటీమణులుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా సినీ నేపథ్యం ఉన్న హీరోయిన్ల జాబితాను ఓ సారి చూద్దాం..
కేరళ కుట్టి
పరిశ్రమకు వచ్చిన కొన్ని రోజుల్లోనే ‘మహానటి’ అనిపించుకున్నారు కీర్తి సురేశ్. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె. 2000లో తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం ‘పైలట్స్’ ఆమె తొలి సినిమా. అంతేకాదు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ వంటి చిత్రాల్లో, కొన్ని సీరియల్స్లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్గా ఆమె మొదటి సినిమా మలయాళ చిత్రం ‘గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’తో కీర్తి సురేశ్ తెలుగులో తెరంగేట్రం చేశారు. ‘మహానటి’తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆపై పలు కమర్షియల్ సినిమాల్లో నటించి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖి’, రంగ్దే’తో పాటు ఓ తమిళ, ఓ మలయాళ సినిమాలు ఉన్నాయి. |
శ్రీదేవి తనయ..
నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల మొదటి కుమార్తె జాన్వి కపూర్ ఒక్క చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు. 2018లో ఆమె తొలి సినిమా ‘ధడక్’ విడుదలై, మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆమె వరుస చిత్రాలకు సంతకం చేశారు. ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ అఫ్జా’, ‘దోస్తానా 2’ సినిమాల్లో సందడి చేయబోతున్నారు. ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే సిరీస్లో నటించి, మెప్పించారు. |
మెగా వారసురాలు
‘ఒక మనసు’తో హీరోయిన్గా పరిచయమైన మెగా వారసురాలు, నాగబాబు కుమార్తె నిహారిక. ఆపై ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాల్లో ఆమె నటించారు. ‘ఒరు నల్లనాల్ పాతు సొల్రెన్’తో కోలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించారు. ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరోపక్క నిర్మాతగా వెబ్సిరీస్లు కూడా నిర్మిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ’, ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్’ వంటి సిరీస్ తీశారు. ఆమె తర్వాతి సినిమా ప్రకటించాల్సి ఉంది. |
రాజశేఖర్ వారసురాళ్లు..
సీనియర్ నటులు రాజశేఖర్-జీవితల ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక కథానాయికలుగా మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో అరంగేట్రం చేశారు. ఇందులో ఆమె నటనను అందరూ మెచ్చుకున్నారు. అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు ఆమె కృష్ణవంశీ ‘రంగమార్తాండా’, దుర్గ నరేష్ ‘విధి విలాసం’లో నటిస్తున్నారు.
ఇక రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ కూడా నటిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య అడవి శేష్తో కలిసి హిందీ హిట్ ‘టూ స్టేట్స్’ చిత్రంలో నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. |
సైఫ్ అలీ ఖాన్ బేటీ..
పటౌడీ వారసురాలు, నటులు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ల కుమార్తె సారా అలీ ఖాన్. ఈ భామ తొలి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 2018లో వచ్చిన ‘కేదార్నాథ్’ ఆమె అరంగేట్ర చిత్రం. దీని తర్వాత ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’ సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి ‘కూలీ నెంబరు 1’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. |
లిసీ తనయ..
దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందారు. ‘క్రిష్ 3’ అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్, ‘ఇరుముగన్’ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఆమె.. ‘హలో’తో అరంగేట్రం చేశారు. ‘చిత్రలహరి’, ‘రణరంగం’, ‘హీరో’ తదితర చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తమిళ, మలయాళ ప్రాజెక్టులు ఉన్నాయి. |
చుంకీ పాండే డాటర్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. 2019 ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ‘పతి పత్ని ఔర్ ఓ’తో అదే ఏడాది హిట్ అందుకున్నారు. మరో హిందీ ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంతకం చేశారు. ఇందులో ఆమె ‘అర్జున్ రెడ్డి’ సరసన కనిపించనున్నారు. |
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్